భాను ప్రియా, రాధా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ రెండు పాత్రలు చేసారు. సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, షణ్ముఖ శ్రీనివాస్, రఘువరన్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాలో కన్నడ ప్రభాకర్ విలన్ గా యాక్ట్ చేసారు. ఇక అసలు విషయం ఏమిటంటే, త్వరలో ఈ సినిమా ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక ప్రముఖ నిర్మాత రీమేక్ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.
పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఇప్పటికే సదరు నిర్మాత ఆ మూవీ ని రీమేక్ చేసేందుకు ఒక బడా దర్శకుడిని ఎంపిక చేసారట. ఇక ఇటీవల సినిమా విషయమై హీరో పవన్ కళ్యాణ్ తో చర్చిండడం, పవన్ కూడా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్. ఒరిజినల్ వర్షన్ కి ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా మరింత అద్భుతంగా ఈ సినిమాని సదరు దర్శకుడు తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం హరిహర వీరమల్లు, రానాతో ఒక సినిమాతో పాటు త్వరలో హరీష్ శంకర్ సినిమాలు కూడా చేయనున్న పవన్, అవి పూర్తి అయిన వెంటనే జేబు దొంగ రీమేక్ ని ప్రారంభించనున్నారని, అలానే ఈ సినిమా టైటిల్ ని కూడా జేబుదొంగ గానే నిర్ణయించినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగాఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి ...... !!