మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుని హీరోగా గొప్ప క్రేజ్ తో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక ఆయన కెరీర్ లో సక్సెస్ఫుల్ సినిమాల్లో 1987లో వచ్చిన జేబు దొంగ మూవీ కూడా ఒకటి. రోజా మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటెర్టైనర్ గా అప్పట్లో భారీ స్థాయిలో రూపొందింది.
భాను ప్రియా, రాధా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో మెగాస్టార్ రెండు పాత్రలు చేసారు. సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, షణ్ముఖ శ్రీనివాస్, రఘువరన్ తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ సినిమాలో కన్నడ ప్రభాకర్ విలన్ గా యాక్ట్ చేసారు. ఇక అసలు విషయం ఏమిటంటే, త్వరలో ఈ సినిమా ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక ప్రముఖ నిర్మాత రీమేక్ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న న్యూస్ ప్రకారం ఇప్పటికే సదరు నిర్మాతమూవీ ని రీమేక్ చేసేందుకు ఒక బడా దర్శకుడిని ఎంపిక చేసారట. ఇక ఇటీవల సినిమా విషయమై హీరో పవన్ కళ్యాణ్ తో చర్చిండడం, పవన్ కూడా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని టాక్. ఒరిజినల్ వర్షన్ కి ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా మరింత అద్భుతంగా ఈ సినిమాని సదరు దర్శకుడు తెరకెక్కించనున్నాడట. ప్రస్తుతం హరిహర వీరమల్లు, రానాతో ఒక సినిమాతో పాటు త్వరలో హరీష్ శంకర్ సినిమాలు కూడా చేయనున్న పవన్, అవి పూర్తి అయిన వెంటనే జేబు దొంగ రీమేక్ ని ప్రారంభించనున్నారని, అలానే ఈ సినిమా టైటిల్ ని కూడా జేబుదొంగ గానే నిర్ణయించినట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మెగాఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ వార్తే అని చెప్పాలి ...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: