సినిమా పరిశ్రమలో పెళ్లిళ్లు నిలబడవు అనేది బయట వ్యక్తులు చెబుతున్న మాట. అది నిజం చేస్తూ చాలా మంది నటీనటులు ఇప్పటి వరకు విడాకులు తీసుకుని తమ వివాహబంధాన్ని తెంచుకున్నారు. మొదటి
పెళ్లి విడాకులకు వెళ్ళిందంటే అవగాహన లోపం కావచ్చు అని అనుకోవచ్చు. కానీ చేసుకున్న ప్రతి
పెళ్లి విడాకులకు వెళుతుండటం తో ఇది ఆలోచించాల్సిన విషయం అవుతుంది. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్న వారు సైతం విడాకులు తీసుకుని మరో పెళ్లికి సిద్దమవుతు భారతీయ సాంప్రదాయాన్ని మంట కలుపుతూన్నారు.
ఇందులో
సినిమా వారు మాత్రమే కాదు బయటి వారు, పెద్ద పెద్ద బిజినెస్ మేన్, ఆటగాళ్లు సైతం ఉన్నారు. ఆ విధంగా మలయాళం లో పాపులర్ నటుడైన
ముఖేష్ గతంలో సరితను
పెళ్లి చేసుకుని ఆమెకు విడాకులు ఇవ్వగా ఆ తర్వాత
దేవిక ను
పెళ్లి చేసుకోగా ఆమెకు కూడా తాజాగా తాజాగా విడాకులు ఇవ్వబోతున్నాడు. మలయాళం లో పాపులర్ జంటగా వీరిద్దరికీ సిద్ధమైన పేరు ఉంది. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డాన్సర్
దేవిక మీడియా ముఖంగా వెల్లడించింది.
ముఖేష్ మంచివాడే కానీ మంచి
భర్త కాలేకపోయాడు అని ఆమె తెలిపింది. ఎనిమిదేళ్లు అవుతున్న ఇప్పటివరకు
ముఖేష్ నీ అర్థం చేసుకోలేక పోతున్నాను అని పేర్కొంది. అందుకే అతనితో తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యాను అని స్పష్టం చేసింది.
వ్యక్తిగత కారణాల వల్ల నేను నా
భర్త నుంచి విడాకులు కోసం కోర్టులో దరఖాస్తు చేశాను. ఈ విషయంలో
ముఖేష్ అభిప్రాయం ఏమిటో నాకైతే తెలియదు అన్నారు. కానీ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను అన్నారు. నేను అతని పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా నటుడిగా అతని వ్యక్తిగత విషయాలను ప్రస్తావించిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న అనేక ఆరోపణల గురించి స్పందించేంత అవసరం ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతని మీద గృహ హింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలాగని నేనేమీ ఆవేశంలో కోపం తో విడిపోవడం లేదు అని చెప్పుకొచ్చింది. ఈ విడాకులకు సంబంధించి తనకు ఎలాంటి నోటీసు అందలేదని
ముఖేష్ చెబుతుండడం మరో ట్విస్ట్.