నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య త‌న‌యుడు నంద‌మూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అదిరిపోయే అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా ఈ యేడాదే ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంద‌ని టాక్ ?  బాల‌య్య కూడా మోక్ష‌జ్ఞ సినిమాను ఈ యేడాది ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టేశార‌ట‌. బాల‌య్య ఇటీవ‌ల త‌న తాజా ఇంట‌ర్వ్యూలో సైతం తాను మోక్షజ్ఞ కలిసి త‌న బంప‌ర్ హిట్ సినిమా ఆదిత్య 369 సినిమా సీక్వెల్ లో నటిస్తున్న‌ట్టు చెప్పారు. బాల‌య్య ఈ విష‌యం చెప్పిన‌ప్ప‌టి నుంచే నంద‌మూరి అభిమానుల జోష్ మామూలుగా లేదు. ఇక మోక్షు డెబ్యూ మూవీ ఇదే అని అనుకున్నారు.

అయితే ఇప్పుడు మోక్షు డెబ్యూ మూవీ గురించి మ‌రో న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. మోక్షు త‌న తొలి సినిమాలో బాల‌య్య‌తో క‌లిసి న‌టించ‌డం లేద‌ట‌. మోక్షు మొదటి సినిమాలో సోలో హీరోగానే కనిపించబోతున్నాడ‌ని విశ్వసనీయంగా స‌మాచారం అందింది. బాల‌య్య సూచ‌న‌ల మేర‌కు ఇప్ప‌టికే వినాయ‌క్‌, పూరి జ‌గ‌న్నాథ్ లాంటి ద‌ర్శ‌కులు మోక్ష‌జ్ఞ కోసం ప‌లు క‌థ‌ల‌ను రెడీ చేసి ఉంచార‌ట‌. ఇక హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్న మోక్ష‌జ్ఞ ఫిజిక్‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌డంతో పాటు మార్ష‌ల్ ఆర్ట్స్‌, డ్యాన్సుల్లో శిక్ష‌ణ పొందుతున్నార‌ట‌.

ఇక వారాహి చ‌ల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి మోక్ష‌జ్ఞ‌కు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి డేట్లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే మోక్షు తొలి సినిమా ఆయ‌న బ్యాన‌ర్లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఓ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడితోనే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ ఉంటుంద‌ని కూడా తెలుస్తోంది. ఇక ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీస్ కూడా మోక్షుతో ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. అయితే అదే డెబ్యూ మూవీ అవుతుందా ?  లేక అది రెండో సినిమా అవుతుందా ? అన్న‌ది కూడా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: