అయితే కరోనా కారణంగా అన్ని షూటింగ్స్ లలాగే హీరో విజయ్ ఆల్రెడీ ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ కూడా ఆలస్యమైన నేపథ్యంలో వంశీ పైడిపల్లి చిత్రం కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది అన్న వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి డైరెక్టర్ వంశీ పైడిపల్లి నుండి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. 2019 మహేష్ బాబుతో 'మహర్షి' సినిమా తర్వాత ఇంత వరకు మరో సినిమా రాకపోవడంతో కాస్త ఫీల్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. మహర్షి వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత కూడా స్టార్ డైరెక్టర్ వంశీ ఇంకా ఆలస్యం చేయడం ఏమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి ఇందుకు దర్శకుడు వంశీ పైడిపల్లి ఎలా స్పందిస్తారో చూడాలి. మరి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి సంతోషకరమైన వార్త వస్తుందేమో చూడాలి.
ఈ మధ్య కాలంలో తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. మన టాలీవుడ్ డైరెక్టర్లు సైతం తమిళ హీరోలతో సినిమాలు తీసేందుకు సై సై అంటున్నారు. ఇప్పటికే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల ఓ పాన్ ఇండియా మూవీని ప్లాన్ చేసి అంతా సిద్ధం చేసుకున్నారు. అలాగే తమిళ సీనియర్ హీరో సూర్య కూడా తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతున్నాను అంటూ తీపికబురు వినిపించారు. మరోవైపు తమిళ ప్రతిష్టాత్మక దర్శకుడు శంకర్ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇలా తమిళ హీరోలు టాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు.