ఆచార్యతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య త్వరలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆచార్య మూవీలో చిరుతో పాటుగా చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆచార్య తర్వాత లూసిఫర్ రీమేక్ తో పాటుగా కె.ఎస్ రవీంద్ర డైరక్షన్ లో మూవీ కూడా ఒకటి లైన్ లో పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి.

ఈ రెండు సినిమాలే కాదు మెహెర్ రమేష్ డైరక్షన్ లో కూడా ఒక సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే కాకుండా లేటెస్ట్ గా టాలీవుడ్ స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుందని టాక్. మహర్షి తర్వాత మరోసారి మహేష్ తోనే సినిమా చేయాలనుకున్న వంశీ పైడిపల్లిసినిమా ప్లేస్ లో కోలీవుడ్ దళపతి విజయ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ తర్వాత వంశీ పైడిపల్లి చిరుతో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని అంటున్నారు. వంశీ పైడిపల్లి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. అంతేకాదు ఈ పార్టీలో కొరటాల శివ, సుకుమార్, బోయపాటి శ్రీను కూడా ఉన్నారు. వీతితో పాటుగా మెహెర్ రమేష్, బి.గోపాల్, వక్కంతం వంశీ కూడా ఉన్నారు. వంశీ పైడిపల్లి చిరుతో సినిమా కన్ ఫర్మ్ అని అంటున్నారు. చిరు, వంశీ పైడిపల్లి ఈ కాంబో నిజంగానే అదిరిపోయే సినిమా వస్తుందని చెప్పొచ్చు. ఊరికే ఫోటో దిగినంత మాత్రనా సినిమా ఉన్నట్టు చెప్పాలా అంటే కొన్ని ఫోటోలు ఊరకనే దిగరు కచ్చితంగా ఏదో ఒక హింట్ ఇస్తారని చెప్పుకోవచ్చు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: