టాలీవుడ్ మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను సూపర్ స్టార్ మహేష్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్నారు. మహేష్ కోసం అప్పుడెప్పుడో కథ సిద్ధం అని చెప్పిన బోయపాటి శ్రీను ఆ సినిమా ఎప్పుడన్నది మాత్రం చెప్పలేదు. బోయపాటి, మహేష్ కాంబో చాలా క్రేజీగా ఉంటుందని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేయాల్సిందే. బాలకృష్ణతో మూడు సినిమాలు.. ఎన్.టి.ఆర్ తో ఒకటి.. అల్లు అర్జున్ తో ఒకటి.. రాం చరణ్ తో ఒక సినిమా చేసిన బోయపాటి శ్రీను తన నెక్స్ట్ ఫోకస్ మహేష్ మీద పెట్టినట్టు తెలుస్తుంది.

మహేష్ లాంటి స్టార్ హీరోతో బోయపాటి లాంటి మాస్ డైరక్టర్ సినిమా తీస్తే రికార్డులు బద్ధలు కొట్టడం గ్యారెంటీ. తప్పకుండా ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే బోయపాటి, మహేష్ కాంబో కోసం మరో మూడేళ్లు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ సర్కారు వారి పాట పూర్తి కాగానే త్రివిక్రం సినిమా లైన్ లో ఉంది. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మూవీ ఉండగా ఆ సినిమా కోసం మహేష్ ఎలా లేదన్నా రెండేళ్లు రాసి ఇచ్చేయాల్సి ఉంటుంది. జక్కన్న సినిమాకు మహేష్ రెండేళ్ల డేట్స్ ఇచ్చేస్తున్నాడు.

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ తో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని తెలుస్తుంది. మహేష్, బోయపాటి కాంబో టాలీవుడ్ లో కచ్చితంగా మరో సంచలన సినిమా అవుతుందని చెప్పొచ్చు. మహేష్ సర్కారు వారి పాట, త్రివిక్రం సినిమా, రాజమౌళి సినిమా ఈ సినిమాలతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. రాబోతున్న సినిమాలతో మహేష్ ఫ్యాన్స్ హంగామా చేసుకునే అవకాశం ఉంది. మహేష్ కూడా ఈ సినిమాలతో ఫుల్ ఫోకస్ గా ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: