యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ ప్రాజెక్ట్ K (వర్కింగ్ టైటిల్) త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. బాలీవుడ్ స్టార్స్ బిగ్ బీ అమితాబ్ ఈ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు తెలిసిందే. దీపిక పదుకొనె హీరోయిన్ గా ఫిక్స్ చేసిన ఈ మూవీలో సెకండ్ ఫీమేల్ లీడ్ గా సమంతని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీకి బడ్జెట్ లో సగం విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేసేలా ప్లాన్ చేశారట.

ప్రాజెక్ట్ కె సినిమా కోసం ప్రభాస్ 200 రోజుల డేట్స్ ఇచ్చినట్టు టాక్. అంటే నాగ్ అశ్విన్ సినిమా కోసం ప్రభాస్ ఏడు నెలలు డేట్స్ మాత్రమే ఇస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. వాటితో పాటుగా ప్రాజెక్ట్ కెకి కూడా డేట్స్ అడ్జెస్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. సలార్ కోసం అటు ఇటుగా మూడు నుండి నాలుగు నెలలు డేట్స్ ఇచ్చిన ప్రభాస్ ఆదిపురుష్ కోసం కేవలం 100 రోజులు డేట్స్ అడ్జెస్ట్ చేశాడని అంటున్నారు. ఇక ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ K సినిమాకు 200 డేస్ అడ్జెస్ట్ చేస్తాడని టాక్.

రాధే శ్యాం ఎలాగు రిలీజ్ కు రెడీగా ఉండగా సలార్ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 22న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక ఆదిపురుష్ 2022 ఎండింగ్ కాని 2023 మొదట్లో రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక నాగ్ అశ్విన్ సినిమా మాత్రం 2024 లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ వరుస సినిమాలు చూస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. ఈ సినిమాలతో మాత్రం ప్రభాస్ స్టార్ గా నెక్స్ట్ లెవల్ క్రేజ్ తెచ్చుకుంటాడని మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు.
   

మరింత సమాచారం తెలుసుకోండి: