RRR కంటే కొన్ని నెలల ముందుగానే ఆచార్య రి
విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో rrr తర్వాత విడుదల కానుంది.ఈ సినిమాతో రామ్ చరణ్ తో విజయం సాధించి కొరటాల శివ రాజమౌళి సెంటిమెంట్ ను తుడిచేయాలనీ చూస్తున్నాడు. rrr తర్వాత ఎన్టీఆర్ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యూనివర్సల్ కథతో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.ఆగష్టు రెండవ వారం నాటికి rrr షూటింగ్ పూర్తి కానుండటంతో ఎన్టీఆర్ కొరటాల శివ మూవీకి సంబంధించిన ఇతర విషయాల గురించి స్పష్టత రానుందట. చాలా తక్కువ సమయంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంవత్సరం వేసవిలో ఈ సినిమా విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ సినిమా తో కూడా విజయం సాధించాల్సిన బాధ్యత కొరటాలపై ఉంది. కొరటాల శివ అన్ని జాగ్రత్తలు తీసుకుని రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలతో విజయం సాధిస్తాడో లేదో చూడాల్సి ఉంది.