టాలీవుడ్
సినీ పరిశ్రమ ఇప్పుడు ఎంత బిజీగా ఉందో మన హీరోలు చేసే సినిమాలను బట్టి తెలుస్తుంది. సీనియర్ హీరోలు
యువ హీరోలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మూడు నాలుగు సినిమాలకు తగ్గకుండా చేస్తుండడం విశేషం. ఈ పరిణామం గత కాలంలో
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ గుర్తు చేస్తుండగా సీనియర్ హీరోలు సైతం నాలుగు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఆ విధంగా
టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అతి తక్కువ కాలంలో అలరించడానికి సిద్దం అవుతున్న హీరోల సినిమాలు ఏంటో చూద్దాం.
బాహుబలి తో పాన్
ఇండియా స్టార్ గా ఎదిగిన
రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అవి సెట్స్ మీద ఉండడం గమనార్హం. రాదేశ్యామ్ త్వరలోనే విడుదల చేస్తుండగా ఆ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్టు కే వంటి సినిమాలను ఆయన సెట్స్ పైన ఉంచారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా నాలుగు సినిమాలతో
యువ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా మాంచి
జోష్ లో ఉన్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచిన
చిరంజీవి ఆ తరువాత లూసిఫర్
రీమేక్ ను, వేదాలం
రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. అలాగే
టాలీవుడ్ డైరెక్టర్
బాబీ దర్శకత్వంలో ఓ
సినిమా ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం లో
చిరంజీవి కనిపిస్తుండటం విశేషం.
మరో వైపు నందమూరి
బాలకృష్ణ కూడా తాను ఏమీ తక్కువ తినలేదు అని నాలుగు సినిమాలను చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచిన బాలక్రిష్ణ ఆ తరువాత గోపీచంద్ మలినేని తో ఓ
సినిమా చేస్తున్నాడు. ఆ
సినిమా ఇంకా పట్టాలు ఎక్కనే లేదు అప్పుడే
పూరి జగన్నాథ్,
అనిల్ రావిపూడి వంటి దర్శకులకు ఓకే చెప్పేశాడట బాలకృష్ణ. పవన్
కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న అయ్యప్పనుం కోషియాం
రీమేక్, ఆ తర్వాత హరిహర వీరమల్లు, ఆపైన హరీష
శంకర్ సినిమా తో కలిపి మొత్తం మూడు కాగా సురేందర్ రెడ్డి,
పూరి జగన్నాథ్ వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.