పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విడుదల చేయాలని ఆ సినిమా పనుల్లో ఎంతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన నుంచి సినిమా వచ్చి సంవత్సరాలు కావస్తున్నాయి. ఫ్యాన్స్ ప్రభాస్ కోసం ఎంతగానో వెయిట్ చేసి నిరాశలో ఉండిపోతున్నారు. ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభాస్ రాధే శ్యామ్ ను ఇక లేట్ చేయవద్దు అని చెప్పి ఆ సినిమా ను పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు.

 కరోనా అడ్డు రాకుండా ఉండి ఉంటే జూలై 26న ఈ సినిమా విడుదల అయి ఉండేది కానీ ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా  నటిస్తుంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు ఫస్ట్ లుక్ పోస్టర్ లకు మంచి స్పందన దక్కడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాపై పూర్తి దృష్టి సాధించిన ప్రభాస్ కు ఓ కొత్త సమస్య మొదలైంది. అదేమిటంటే తన ఇతర సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు ఏవి రావట్లేదని అదే ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే పాన్ ఇండియా సినిమాల చేస్తున్న విషయం తెలిసిందే. అదే కాకుండా బాలీవుడ్ లో ఆది పురుష్ అనే సినిమాను టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ప్రాజెక్ట్ కే అనే సినిమాను చేస్తున్నాడు. ఇటీవలే ప్రాజెక్ట్ కే సినిమా మొదలు కాగా ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ తప్ప మిగతా సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు రావడం లేదని వారు కొంత నిరాశ చెందుతున్నారు. అయితే ఫ్యాన్స్ ఆవేదనను అర్థం చేసుకుని ప్రభాస్ తన పుట్టిన రోజు కానుకగా అన్ని సినిమాలకు సంబంధించిన అప్ డేట్ లను వెల్లడిస్తారని సన్నిహితుల ద్వారా వెల్లడిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: