బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త అయిన రాజ్ కుంద్రాను అశ్లీల వీడియో చిత్రీకరణ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బిజినెస్ మాన్ అయిన రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసు సినీ వర్గంలో లో పెను సంచలనంగా మారింది. అశ్లీల వీడియోలను చిత్రీకరించి పలు యాప్స్ లలో, సైట్లలో లో పబ్లిక్ చేస్తున్నాడనే అభియోగంతో రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన విషయం కూడా మనకు తెలిసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రాజ్ కుంద్రా కు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయితే తాజాగా నటి మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన సోఫియా హయత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.


 నేను బిగ్ బాస్ చేస్తున్న సమయంలోనే ఒక వ్యక్తి నన్ను అశ్లీల సీన్లు చేయాలని అభ్యర్థించాడు అని అంతేకాకుండా షూటింగ్ ప్రారంభించడానికి ముందే అలాంటి సీన్లలో నటించి వీడియోలు పంపాలని కోరాడని ఆమె ఆరోపించింది. గతంలో సోఫియా హయత్ హాలీవుడ్ లో కొన్ని బెడ్రూం  సీన్లు చేసింది. దీంతో నిజంగా అలాంటి సినిమాలు చిత్రీకరించేవారు ఎవరు ముందుగా అలా చేయమని అడగరు అని.. దానితో నేను ఆ ఏజెంట్ ను నమ్మలేదు అని పేర్కొంది. ఇక బాలీవుడ్ లో హీరోయిన్ అవ్వాలనుకున్న వాళ్లను కూడా ఇలాంటి ఏజెంట్లు మోసం చేస్తున్నారు అని సోఫియా పేర్కొంది. డబ్బు కోసం ఏ పని అయినా చేసే కొంతమంది బిజినెస్ మేన్ లు అమ్మాయిలను ట్రాప్ చేస్తారని ఆమె చెబుతోంది. అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి అశ్లీల చిత్రాలలో నటింపచేస్తారని సోఫియా హెచ్చరిస్తుంది. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి మోసం చేసి అశ్లీల చిత్రాలలో నటించేలా చేయడం అత్యాచారం చేయడంతో సమానమని ఈ నటి పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: