అజయ్ భూపతి డైరెక్షన్ లో ఫుల్ ఇంటెన్స్ ఎమోష‌న్స్ తో రూపుదిద్దుకున్న యాక్షన్ డ్రామా 'మహాసముద్రం'. ఈ సినిమాలో శర్వానంద్ మరియు సిద్దార్ధ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ మూవీపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ హీరో సిద్ధార్థ దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుండం మరో విశేషం. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో కొంచెం బిజీగా ఉంది ? త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేసింది చిత్ర బృందం. చెడ్డ వాళ్ల‌యిన విలన్స్.. హ్యాండ్సమ్ ప్లస్ పర్ఫెక్ట్ అనిపించే హీరోల‌ను కూడా ఈ వీడియోలో ఆవిష్కరించడం జరిగింది.

'ఫీల్ ది ఇంటెన్సిటీ` అంటూ  రిలీజ్ చేసిన మహా విజువ‌ల్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ విజువల్స్ చూస్తుంటే 'ఆర్ఎక్స్100' ను మించిన లవ్ స్టోరీ, అలాగే ప్రస్థానం మూవీకి తగ్గ ఫుల్ ఎమోషన్స్ ఉన్నాయనిపిస్తుంది. అయితే, ట్రైలర్ కానీ లేదా టీజర్ కానీ వస్తే ఈ మహాసముద్రంలోని ఎత్తు పల్లాలు ఏమిటో అన్న విషయంపై ఓ క్లారిటీకి రావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే అతి త్వరలోనే ఈ మూవీ  టీజర్ రాబోతుంది అంటూ వినికిడి. మొదట హీరో హీరోయిన్ ల ఫస్ట్ లుక్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్, ఆ తర్వాత కేజీఎఫ్‌ ఫేమ్‌ గరుడ రామ్‌ ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేసి అందర్నీ అట్రాక్ట్ చేసింది. మరి ఇప్పుడేమో ఈ విజువల్.

ఇలా ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేస్తూ ఈ సినిమాపై హైప్ పెంచుతోంది 'మహా సముద్రం' చిత్రబృందం. అయితే ఇందులో ఎంతో లోతైన ఎమోషన్స్ఈ ప్రేక్షకులను కట్టి పడేస్తాయని తెలుస్తోంది. కట్టా దేవా తెరెకెక్కించిన ప్రస్థానం మూవీ లో ఎలాగయితే ఎమోషన్స్ ఉన్నాయో, అంతకు మించిన స్థాయిలో ఎమోషన్స్ ఉన్నాయని చిత్ర బృందం అంటోంది. ప్రస్థానం లో ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దానికి మించి అంటే ఇక వేరే చెప్పక్కర్లేదు. మరి ప్రస్థానానికి మించి మహాసముద్రం ఆకట్టుకుంటుందా చూడాలి.  ఈ సినిమాలో అదితి రావు హైద‌రీ మరియు అనూ ఇమ్మానుయేల్ లు హీరోయిన్స్ గా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: