బాలీవుడ్ నీ షేక్ చేస్తున్న పోర్నోగ్రఫీ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ ఆరోపణలతో అరెస్ట్ కాగా ఆయన గురించి బాలీవుడ్ మాత్రమే కాదు దేశం మొత్తం చర్చ జరుగుతుంది. సెక్స్ రాకెట్ కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తుండగా అందులో కొన్ని సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా ఉందని పోలీసులు ఆ విధంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది సెలబ్రిటీలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఎవరికి వారు తమకు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా
 హీరోయిన్ ఫ్లోరా షైనీ కూడా దీని గురించి క్లారిటీ ఇచ్చారు. ఆశా సైనీ గా తెలుగుప్రజలకు సుపరిచితులైన ఈమె బాలీవుడ్ లో ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహనాయుడు సినిమా లో లక్స్ పాప.. లక్స్ పాప అంటూ బాలయ్య తో అదిరిపోయే స్టెప్పులేసింది ఆశాషైనీ. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్ వంటి పెద్ద సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ అందుకుంది. 

అయితే తాజాగా ఆమె ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. ఫ్లోరా సైని కి రాజ్ కుంద్రా సన్నిహితుడు ఉమేష్ కామత్ కి మంచి స్నేహ సంబంధం ఉంది.   దాంతో ఈ సెక్స్ రాకెట్ తో తనకు సంబంధం ఉందని వార్తలు రాగా వాటిపై క్లారిటీ ఇస్తూ తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది అవన్నీ పుకార్లే అని చెప్పింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పిస్తుంది. ఇటీవలే ఆమె గందీబాత్, ఇన్ సైడ్ ఎడ్జ్ వంటి వెబ్ సిరీస్ లలో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: