మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అందుకు తగ్గ అంకిత భావం తప్పకుండా ఉండాలి. ఇక సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు డెడికేషన్ తో పని చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ఈ పదానికి నిర్వచనమే చిరంజీవి అని చెప్పవచ్చు. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ,ఎవరి అండ దండా లేకుండా ఒక్కడిగా అడుగుపెట్టి, తన పట్టుదల ,కృషి తో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. ఇక అంతే కాదు సినీ ఇండస్ట్రీలో  పెద్దల జాబితాలోకి కూడా చేరిపోయాడు.

సినీ ఇండస్ట్రీ లో ఎవరికైనా కష్టం వచ్చిందంటే చాలు, ఆదుకోవడమే కాదు.. తన వంతు సహాయం కూడా చేస్తాడు. ఈ కరోనా సమయంలో కూడా సినీ కార్మికుల తో పాటు ప్రజలను కూడా ఆదుకున్నాడు. ఇక వీరి కుటుంబంలో వీరి కోడలు ఉపాసన కూడా పలువురికి ఆరోగ్యపరంగా సేవలందిస్తూ, తను కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇక పోతే చిరంజీవి ఒక సినిమా కోసం తన ప్రాణాలను కూడా తెగించి మ‌రీ షూటింగ్‌ చేసాడట. అంతేకాదు ఒళ్ళు కాలిపోయే అంత జ్వరం లో కూడా, ఒక సినిమాలో పాట కోసం ఆయన నటించడం ఇక్కడ గమనార్హం.

ఇంతకు ఆ సినిమా ఏదంటే.. జగదేకవీరుడు.. అతిలోకసుందరి... మెగాస్టార్ కు కమర్షియల్ గా హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమాలో "యమహో నీ యమ యమ అందం.. చెలరేగింది ఎగాదిగా తాపం.." అనే  ఈ పాటకు  శ్రీదేవి తో కలిసి డాన్స్ చేయాలి. అయితే ఈ పాట  షూటింగ్ చేసేటప్పుడు ఆయనకు చాలా జ్వరంగా ఉందట. అయినా కూడా లెక్కచేయకుండా జ్వరం అనే ఫీలింగ్ శరీరంలో, ముఖంలో ఏ మాత్రం కనిపించకుండా శ్రీదేవి తో డాన్స్ చేశాడు .ఇక ఈ సినిమా విడుదల అయ్యి  అప్పట్లో ఒక సంచలనాన్ని సృష్టించింది. అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేసి, సక్సెస్ ఫుల్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: