మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం కొరటాల శివ తీస్తున్న సినిమా ఆచార్య. రామ్ చరణ్ సిద్ద అనే కీలక పాత్ర చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతాన్ని తిరు ఫోటోగ్రఫిని సమకూరుస్తున్నారు. దేవాలయాల భూముల వివాదాలకు సంబంధించి మంచి మెసేజ్ తో పాటు భారీ యాక్షన్ కమర్షియల్ హంగుల మేళవింపుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు లాహే లాహే అనే సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన బ్యాలెన్స్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినట్లు టాక్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుందని అంటున్నారు. మరోవైపు కొన్నాళ్లుగా వరుసగా ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న నటసింహం నందమూరి బాలయ్య, ప్రస్తుతం బోయపాటి శ్రీను తో చేస్తున్న సినిమా అఖండ. యక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా దాదాపుగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇటీవల వచ్చిన ఈ సినిమాలోని రెండు టీజర్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కూడా అక్టోబర్ మొదటి వారంలోనే విడుదల కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ రెండు సినిమాలు గత నెలలోనే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డాయి. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే అతి త్వరలో అటు మెగాస్టార్, ఇటు నట సింహం ఇద్దరూ కూడా తమ తమ సినిమాలతో మరొక్కసారి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు సినిమాల విడుదలకు సంబంధించి ఆయా సినిమాల యూనిట్స్ నుండి అధికారిక ప్రకటనలు మాత్రం రావలసి ఉంది .... !!


మరింత సమాచారం తెలుసుకోండి: