సూపర్ స్టార్ మహేష్ హీరోగా ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట. పరశురామ్ పెట్ల తీస్తున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో ఇటీవల జరిగిన పలు ఆర్ధిక కుంభకోణాలని బేస్ చేసుకుని తెరకెక్కుతున్నట్లు టాక్. కీర్తి సురేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజున ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుందని సమాచారం. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ మొత్తం నాలుగు సినిమాలు చేస్తుండగా వాటిలో రాధేశ్యామ్ మూవీ నేటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. యువి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా రాధాకృష్ణ దీనిని తెరకెక్కిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి కి విడుదల కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇక రానాతో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కూడా ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తుండగా సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుందని మొన్న మేకర్స్ మేకింగ్ వీడియోలో ప్రకటించారు. అయితే 2022 సంక్రాంతికి ఈ ముగ్గరు బడా టాలీవుడ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలుస్తుండటంతో ఇప్పుడు ప్రేక్షకాభిమానులు అందరూ కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు వీరిలో ఎవరు ఏ స్థాయి విజయాన్ని అందుకుని ఎంత రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడతారు అంటూ ఎవరికి తోచిన లెక్కలు వారు వేసుకుంటున్నారు. కాగా రాధేశ్యామ్ టీమ్ నుండి కూడా సంక్రాంతి విడుదలకు సంబంధించి అధికారిక అనౌన్స్ మెంట్ వచ్చినట్లైతే ఖచ్చితంగా ప్రభాస్, మహేష్, పవన్ ముగ్గరూ కూడా ఆ సమయంలో పోటీ పడడం ఖాయం..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: