సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట పై ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అవుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచి యాక్షన్ తో కూడిన మాస్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల ని అలరించేలా తెరకెక్కిస్తున్నట్లు టాక్.

ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మొదలుపెట్టారు. మహేష్ ఒక డిఫరెంట్ రోల్ చేస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ మది ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ రాగా నేడు కొద్దిసేపటి క్రితం ఈ సినిమా నుండి మహేష్ బ్యాగ్ పట్టుకుని నడుస్తూ వెళ్తున్న ఒక లేటెస్ట్ పోస్టర్ ని విడుదల చేసారు యూనిట్ సభ్యులు.

కాగా ఫస్ట్ నోటీస్ పేరుతో పూర్తి స్థాయి పోస్టర్ ని ఈనెల 31న విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. ఇక నేడు విడుదల చేసిన మహేష్ పోస్టర్ సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతుండగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. భారీ నిర్మాణాత్మక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సుబ్బరాజు నటిస్తున్నట్లు సమాచారం. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు ....!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: