వరుసగా సినిమాలు కన్ ఫర్మ్ చేస్తూ ప్రభాస్ తన ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది. సుజిత్ డైరక్షన్ లో వచ్చిన సాహో మూవీ కొద్దిగా నిరాశపరచినా బీ టౌన్ ఆడియెన్స్ ను మాత్రం మెప్పించింది. ఇక త్వరలో రాధే శ్యాం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. ఈ మూవీలో ప్రభాస్ కు జతగా పూజా హెగ్దే నటించిన విషయం తెలిసిందే. జిల్ సినిమాతో ప్రతిభ చాటుకున్న రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ చేస్తున్న మరో రెండు భారీ సినిమాలు సలార్, ఆదిపురుష్. ఈ రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్లలో వస్తున్నాయి. సలార్ ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుంది. ఆదిపురుష్ మాత్రం రామాయణ కథతో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అని భారీ మూవీకి సన్నాహాలు చేస్తున్నారు. ఈమధ్యనే ఆ మూవీ ఓపెనింగ్ జరిగింది. సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో బీ టౌన్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనె హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.

దీపికతో పాటుగా సమంత కూడా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తుందని అంటున్నారు. సమంత ఉంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ఉండగా మళ్లీ స్పెషల్ గా సమంతతో వచ్చే క్రేజ్ ఏముంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. అదీగాక దీపిక పదుకొనె లాంటి ముద్దుగుమ్మ కూడా ఈ సినిమాలో ఉంది కాబట్టి మరెవరు అవసరం లేదని అంటున్నారు. ప్రాజెక్ట్ కె లో అక్కినేని సమంత ఉంటుందా లేదా అన్నది చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: