దేశంలో కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాలో కథ పెద్దగా కనిపించకపోయిన సినిమాలోని నటులు వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా దర్శకుడు అనుదీప్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. అంతేకాదు.. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

అయితే జాతిరత్నాలు సినిమాతో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు అనుదీప్ తన తదుపరి సినిమాను హీరో శివ కార్తికేయన్ తో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాని తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కనట్లు సమాచారం. అంతేకాదు.. ఏషియన్ గ్రూప్ అధినేత నారాయణ్ దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిచనున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. ఈ సినిమా కోసం శివ కార్తికేయన్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ స్టార్ రష్మికను ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నారు.

అంతేకాక.. రష్మిక ‘సుల్తాన్’ సినిమాతో కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా.. ఈ సినిమా అక్కడ మంచి హిట్ సొంతం చేసుకుంది. అయితే రష్మికను హీరోయిన్ గా తీసుకుంటే ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కాగా.. ఈ విషయంలో అమ్మడు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంట. ఇక తెలుగులో వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తుంది.

అలాగే శర్వానంద్ నటిస్తోన్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’లో హీరోయిన్ గా ఆమెనే హీరోయిన్ గా చేస్తున్నారు. ఇక వీటితో పాటు బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ లాంటి సినిమాల్లో నటిస్తుంది. అంతేకాక.. రీసెంట్ గానే అమ్మడు ముంబైలో ఇల్లు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్యూచర్ లో మరిన్ని బాలీవుడ్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: