ఇండస్ట్రీలో అదృష్టం కలిసొచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ రేంజ్ కి ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఒక్కరు. బుచ్చిరెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా తరువాత హీరో, హీరోయిన్స్ కి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇక ఉప్పెన ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె తొందరపడి వేటికి ఓకే చెప్పడం లేదంట.

ఇక ప్రస్తుతం సుధీర్ బాబు- ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’,రామ్-లింగుస్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ… వంటి ప్రాజెక్టుల్లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆ తరువాత తర్వాత చాలా ప్రాజెక్టుల్లో కృతి శెట్టి ఎంపికైనట్టు ప్రచారం జరుగుతుంది. కానీ.. వాటిలో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు.

అయితే ఆ తర్వాత నటించబోయే ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను స్వయంగా నేనే ప్రకటిస్తాను’ అంటూ కూడా కృతి శెట్టి తెలిపిన సంగతి తెలిపిన విదితమే. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా కృతి శెట్టి మరో రెండు ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ లో కృతి శెట్టి హీరోయిన్ గా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది.

అంతేకాక.. కళ్యాణ్ కృష్ణ కురసాల తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆమె నాగ చైతన్య సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్.ఆర్.శేఖర్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా కృతిశెట్టి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అలాగే వీటిలో ఆమె ఒక్కో సినిమాకి గాను రూ.75 లక్షల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తోంది. అయితే ‘ఉప్పెన’ తర్వాత ఈమె ఒప్పుకున్న 3 సినిమాలకి రూ.60 లక్షల చొప్పున పారితోషికం అందుకోగా ఇప్పుడది రూ.75 లక్షలకి చేరుకున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: