యంగ్ రెబెల్ స్టార్ ప్రభాష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా రాధే శ్యామ్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు.ఇక ఈ రెండు సినిమాల తర్వాత 'ఆదిపురుష్' రానుంది.తానాజీ వంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ ఈ సినిమాకి దర్శకుడు.3డీ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలోకనిపించనుండగా.. ఆయన సరసన సీతగా కృతి సనన్ నటించనుంది.

ఇక్కడ రావణుడిగా బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు.అయితే చాలా రోజులుగా ఈ సినిమా నుండి అప్డేట్స్ లేక ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.అంతేకాదు ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రభాస్ లేకుండానే షూటింగ్ జరుగుతోంది.ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తి చేసుకుంది.అంతేకాదు రీసెంట్ గానే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు.ఈ షెడ్యూల్ లోసైఫ్ అలీ ఖాన్ తో పాటూ కృతి సనన్ కూడా పాల్గొనబోతున్నారు.ఇక వచ్చే నెల నుండి ప్రభాస్ ఆదిపురుష్ సెట్ లో అడుగు పెట్టనున్నాడట.

ముంబై లోని మెహబూబ్ స్టూడియోలో ఈ సినిమా కోసం క్రోమా సెట్స్ కూడా వేశారు.ఇక ఈ సినిమాలో వీఎఫెక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉందట.అందుకే ఈ సినిమాకి సంబంధించిన కీ సీక్వెన్స్ లు గ్రాఫిక్స్ లోనే ఉండనున్నాయి.ఇక ఇదిలా ఉంటె ప్రభాస్ రీసెంట్ గానే రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ ని పూర్తి చేశారు.ఇక మరోవైపు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్' షూటింగ్ ని మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తున్నారు.ఇక అతి త్వరలోనే మొదలు కానున్న ఈ షూటింగ్ లో ప్రభాస్ తో పాటుగా కీలక నటీనటులు కూడా పాల్గొననున్నారు.వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: