మళయళంలో సూపర్ హిట్టైన పృధ్విరాజ్ సుకుమారన్ బిజూ మీనన్ నటించిన అయ్యప్పనుం కోషియం సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్, రానా కలిసి రీమేక్ చేస్తున్నారు. సినిమాలో పవన్ నటించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రం డైలాగ్స్ తో పాటుగా స్క్రీన్ ప్లే అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమాకు పేరుకే దర్శకుడు సాగర్ చంద్ర పేరుని వాడుతున్నట్టు ఉంది.

సినిమా మొత్తం త్రివిక్రం ఆర్డర్స్ మేరకే నడుస్తుందని అంటున్నారు. జస్ట్ యాక్షన్, కట్ చెప్పడానికి మాత్రమే డైరక్టర్ సాగర్ చంద్ర పనిచేస్తున్నారని మిగతా కథ మొత్తం త్రివిక్రం నడిపిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో పవన్ క్యారక్టరైజేషన్ ను కూడా పెంచినట్టు తెలుస్తుంది. మాత్రుక సినిమాకు ఈ సినిమాకు చాలా మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్యారక్టర్ ను ఆయన ఇమేజ్ కు తగినట్టుగా రాసుకున్నారట.

ఏకే రీమేక్ లో రానా కూడా నటిస్తున్నడు. అయితే రానా పాత్రని కూడా పవన్ పాత్రకి ధీటుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా త్వరగానే పూర్తి చేసి 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. సంక్రాంతికి మహేష్ సర్కారు వారి పాట సినిమా కూడా వస్తుండగా ఆ సినిమాకు పోటీగా పవన్, రానాల సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రెండు సినిమాలే కాదు 2022 పొంగల్ వార్ లో ప్రభాస్ రాధే శ్యాం కూడా పోటీలో దిగుతుందని అంటున్నారు. పవన్, మహేష్, ప్రభాస్ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా పోటీ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే వేటికవి ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు కాబట్టి ఈ మూడు సినిమాల మీద ప్రేక్షకుల అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. అయితే ఫైనల్ విజేత ఎవరన్నది మాత్రం అప్పుడే తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: