కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తెలుగులో డైరెక్ట్ మూవీ విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ మూవీని దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అసలైతే మహర్షి మూవీ తర్వాత వంశీ పైడిపల్లి మహేష్ తోనే ఒక సినిమా చేయాల్సి ఉంది కాని ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. మహేష్ కథ పూర్తిగా నచ్చకపోవడంతో ఆ మూవీ అటకెక్కిందని టాక్. ఇక లేటెస్ట్ గా దళపతి విజయ్ తో తెలుగు, తమిళ భాషల్లో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు వంశీ పైడిపల్లి.

మాములుగానే విజయ్ సినిమాలకు తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగు దర్శకుడితో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు భారీగా ఉంటాయి. ఈ అంచనాలకు తగినట్టుగానే వంశీ పైడిపల్లి మూవీ కథ రాసుకున్నాడని తెలుస్తుంది. ఇక ఈ మూవీలో నటిస్తున్నందుకు గాను విజయ్ భారీ డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దళపతి విజయ్ కు ఈ సినిమా కోసం దిల్ రాజు 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తుంది.

మరి రెమ్యునరేషన్ గానే అంత ఇస్తున్నారు అంటే సినిమా బడ్జెట్ కూడా మరో 100 కోట్ల పైన ఉండే అవకాశం ఉంటుంది. దిల్ రాజు ఒకేసారి రెండు భారీ సినిమాలను పెట్టుకున్నాడు. ఒకటి వంశీ పైడిపల్లితో దళపతి విజయ్ సినిమా కాగా.. రెండోది శంకర్, రాం చరణ్ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. చరణ్, శంకర్ మూవీ కూడా 200 కోట్ల పైన బడ్జెట్ తో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. అంటే ఈ రెండు సినిమాల మీదే దిల్ రాజు దాదాపు 500 కోట్ల దాకా ఇన్వెస్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నాడు అంటే భారీ లాభాలే వెనకేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: