బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ ఎవరూ అని ఎవర్ని అడిన వెంటనే వచ్చే సమాధానం కియారా అద్వానీ. చలనచిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలో అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. అంతేకాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా యాక్ట్ చేసిన భరత్ అనే నేను అనే చిత్రంలో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టడంతో  ఈ అమ్మడి స్టేటస్ ఎక్కడికో వెళ్లిపోయింది. వెంటనే రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామలో నటించినా ఆ సినిమా ఫ్లాప్ అయింది. నిరాశతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. టాలీవుడ్ పై ఆ బ్యూటీకి ఇంకా ఆశ చావలేదు. అందుకే అవకాశం వస్తే చేసేందు సిద్ధంగానే ఉంది కియారా.

కియారా అద్వానీ.. తెలుగులో సినిమాలు లేకపోయినా.. సామాజిక మాద్యమాల్లో చురుగ్గానే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారులో గిలిగింతలు పెడుతూనే ఉంది. ఆ మధ్య సముద్రం అడుగు భాగాన స్విమ్ సూట్ లో ఈదుతూ సెగలు రేపింది. ఇటీవల బాలీవుడ్ లో సిద్ధార్ధ మల్హోత్సా పక్కన హీరోయిన్ గా షెర్షా అనే చిత్రంలో నటించింది. అంతేకాదు వరుస చిత్రాలను లైన్ లో పెట్టింది ఈ అమ్మడు.

కియారా అద్వానీ పూర్తి పేరు కియారా అలియా అద్వానీ. ఆమె ముంబయిలో 1992వ సంవత్సరం జులై 31న తేదీన పుట్టారు. కియారా పేరెంట్స్ జగదీప్, జెనీవీలు. ఈ భామ ఫగ్లీ అనే సినిమాతో హిందీ చలన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఎం.ఎస్.ధోనీతో దేశవ్యాప్తంగా మార్మోగిపోయారు. ఇక 2017వ సంవత్సరంలో టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమలో భరత్ అనే నేను చిత్రంతో పరిచయమయ్యారు. .

 ఇక కియారా అద్వానీ తెలుగులో సినిమా అంటే మరో మాట చెప్పకుండా ఐదు కోట్లు చేతిలో పెట్టాల్సిందే. టాలీవుడ్ లో నటించిన ఏ హీరోయిన్ ఇప్పటి వరకు ఐదుకోట్లు తీసుకోలేదు. ఒక్క నయనతార తప్ప. బాలీవుడ్ లో ఏమని కబీర్ సింగ్ చేశారో ఆమె స్టార్ హీరోయన్ గా మారిపోయారు. లక్ష్మీ, ఇందుకీ జవానీ లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కియారా స్టేటస్ మాత్రం తగ్గలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: