సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ సంపత్ నంది అంటే, మాస్ సినిమాలకి పెట్టింది పేరు. ఇక మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపుగా ఒక ఆరు సినిమాలు తన చేతిలోనే ఉన్నాయి చిరంజీవికి. అయితే వీరిద్దరూ కలవడం వెనుక సినిమా ఉంటుందని ఊహాగానాలు తెరవెనుక బాగా ప్రచారం అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు కలిశారో తెలుసుకుందాం.

చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ సినిమా ఆగస్టు నెలలో పూర్తి అవుతున్నట్లు సమాచారం. ఇక ఆచార్య సినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ సినిమా వైపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. లూసిఫర్ చిత్రాన్ని వీరి సొంత బ్యానర్ లోనే నిర్మించారు. లూసిఫర్ చిత్రంలో తన సోదరి పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ కోసం ఎదురుచూస్తున్నారట.

లూసిఫర్ సినిమా అయిపోయిన వెంటనే మైత్రి మూవీ బ్యానర్ పై  మరొక సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీని తర్వాత మరొక సినిమా"వేదాళం " లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇదే తరుణంలో డైరెక్టర్ సంపత్ నంది కూడా చిరంజీవికి ఒక కథను వివరించారట. ఆ కథ కూడా చిరంజీవికి బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది.

ఇక సంపత్ నంది అయితే ఈరోజు నాకు చాలా స్పెషల్ అంటూ తనదైన శైలిలో ఒక పోస్ట్ పెట్టి విడుదల చేశాడు. ఇలా చేయడంలో వీరిద్దరి నుంచి ఒక సినిమా వస్తుందనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఈయన గోపీచంద్ తో సిటీమార్ సినిమాను పూర్తిచేసినట్లు తెలుస్తోంది.చిరంజీవి సంపత్ నంది దర్శకత్వంలో కూడా త్వరలో మన ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా రీమేక్ కావడంతో ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరగనున్నాయి.ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: