ఇక ఎన్నో రోజుల నుంచి మా ఎలక్షన్ల ప్రస్తావనే జరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడా అని ఎలక్షన్లు ఎదురుచూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఇక దీనిపై ఎంతోమంది సినీ నటులు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లకు మెగాస్టార్ కి ఉన్న లింక్ ఏంటో తెలుసుకుందాం.


అయితే రీసెంట్ గా కొందమంది మా పెద్దలు హీరో కృష్ణంరాజుకు ఒక లేఖను కూడా రాయడం జరిగింది. ఈ ఎలక్షన్ లపై మీరు మాట్లాడాల్సిందిగా కోరుతున్నట్లు కృష్ణంరాజుకు ఒక లెటర్ ద్వారా వారు  తెలియజేశారట. దాంతో కృష్ణంరాజు మాసినేని.. పెద్దలతో మాట్లాడట. ఇక ఎలక్షన్ లు  జరగనున్నాయనే నేపథ్యంలో జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు తదితరులు పోటీ చేస్తున్నట్లు ప్రకటించుకున్నారు. ఇక వీరి మధ్య గట్టిపోటీని ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఏకగ్రీవం చేయాలనే ఆలోచనను  కూడా పక్కన పెట్టినట్లు సమాచారం.

అలా ప్రకటించుకున్న వారిలో కొంతమంది సినీ పెద్దలను కూడా కలవడం జరిగింది. తమకు మద్దతు ఇవ్వమని తెలియజేసినట్లు కూడా వెలువడింది. ఈ విషయాన్ని ఎలాగోలాగా పరిష్కారం చేయాలన్న  ఉద్దేశంతోనే.. మా మా సినీ పెద్దలు అందరూ కలిసి ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎలక్షన్లు ఎంతో రసవత్తరంగా సాగేలా ఉన్నాయి అన్నట్లు వివరించనున్నారు.

ఎలక్షన్ లను సెప్టెంబర్ 12న, నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అందుకోసమే ముందుగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం చిరంజీవి పుట్టిన రోజున ఆగస్ట్ 22 న సమావేశం నిర్వహించబోతున్నారు అని తెలిపారు. అయితే ఏది ఏమనగా ఆరోజున మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఇందులో పాల్గొంటారు.. కనుక అందుచేతనే ఈ ఎన్నికలు వారి చేతిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మా ఎన్నికల జరగడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: