మెగాస్టార్ చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయడంలో దిట్ట. ఆయన ఒక్కసారి స్క్రిప్ట్ చేంజ్ చేశారంటే.. అది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడం ఖాయం. ఇప్పటికే ఆయన చాలా మంది దర్శకులకు స్క్రిప్టు విషయంలో ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనే అంచనాలు కూడా నిజమయ్యాయి. ప్రేక్షకులకు ఎలా ఉంటే సినిమా నచ్చుతుంది అనే విషయాలను అంచనా వేయడంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.

అయితే ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్ లతో బిజీగా ఉన్నారు. కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీతో కలిసి మరొక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి ని డ్యూయల్ రోల్ లో చూపించాలని బాబీ భావిస్తున్నారు. అయితే ఇన్సైడ్ టాక్ ప్రకారం.. బాబీకి చిరంజీవి విలువైన సలహాలు ఇచ్చారట. బాబీ ఒక పవర్ ఫుల్ స్టోరీ తో చిరంజీవి వద్దకు వచ్చారని.. ద్విపాత్రాభినయం చేయాలని అడిగారని సమాచారం. ఈ పవర్ ఫుల్ స్టోరీ కి వీరయ్య అనే పేరు టైటిల్ గా నిర్ణయించినట్టు చెప్పారు.

అయితే ఈ కథలో చిరంజీవి కొన్ని మార్పులు చేశారు. తానొక్కరే డ్యూయల్ రోల్ చేయడానికి బదులుగా మల్టీస్టారర్ సినిమాగా మార్చాలని బాబీకి చిరంజీవి సలహా ఇచ్చారట. దీంతో బాబీ తన కథను మల్టీస్టారర్ సినిమాకి తగ్గట్టుగా మార్చుతున్నారు. రెండవ క్యారెక్టర్ ని ఆయన మరింత పవర్ ఫుల్ గా మార్చుతున్నారు. దీంతో ఈ సినిమాలో చిరంజీవి తో కలసి నటించే స్టార్ హీరో కి మంచి రోల్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఆ స్టార్ హీరో పాత్రలో ఎవరు నటిస్తారనేది ప్రశ్నగా మారింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులలో ఎవరో ఒకరు నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి ఆచార్య తో ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ లో కూడా ఒక యంగ్ హీరో కనిపించనున్నారని సమాచారం. ఈ విధంగా చూసుకుంటే ఆయన మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: