టాలీవుడ్
సినిమా పరిశ్రమకు ఇప్పటి వరకు రాని కష్టం వచ్చింది.
కరోనా కారణంగా
సినిమా థియేటర్లు మూసివేయడంతో ఇప్పటివరకు అవి తెరుచుకోలేదు. కాగా ఈ శుక్రవారం నుంచి కొన్ని సినిమాలు విడుదల కాగా వాటి కోసం కొన్ని థియేటర్లు విడుదల అయ్యాయి. అయితే పూర్తి స్థాయిలో మాత్రం
థియేటర్ లు ఓపెన్ కాలేదనే చెప్పాలి. కొంతవరకు మాత్రమే
సినిమా థియేటర్లు ఓపెన్ అయి సినిమాలను విడుదల చేశాయి. సత్యదేవ్ నటించిన తిమ్మరాజు చిత్రం ఈ శుక్రవారం విడుదల కాగా ఆ సినిమాకు టాక్ సంగతి పక్కన పెడితే
సినిమా థియేటర్ లో విడుదలైన ప్రతి ఒక్కరు ఎంతో సంతోషించారు.
టాలీవుడ్ ఏ
నిర్మాత చేరి ధైర్యాన్ని తిమ్మరుసు
నిర్మాత చేయడం తన సినిమాను థియేటర్లలో విడుదల చేయడం అందరూ ప్రశంషించాల్సిన విషయం.
టాలీవుడ్ భవిష్యత్తును తీర్చిదిద్దే సినిమాగా తిమ్మరుసును అవి వర్ణించగా ఆ
సినిమా ఇచ్చిన ధైర్యంతో కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తారా అని అసలు విషయం. మరోవైపు ఇంకొక యంగ్
హీరో తేజ సజ్జ కూడా తన ఇష్క్
సినిమా ను
థియేటర్ లలో విడుదల చేయగా ఆ
సినిమా కూడా థియేటర్లలోనే విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక ఇప్పటినుంచి అసలు సమరం మొదలుకానుంది. మొదలైతే పెట్టారు కానీ దాని కొనసాగించే వారు మాత్రం ఇప్పటివరకు వరకు లేకపోవడం మళ్లీ
టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తుంది. ఆగస్టులో తమ సినిమాల విడుదల అంటూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించకపోవడం మళ్ళీ సినిమాలు విడుదలైతాయా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు ప్రేక్షకులు. పరిస్థితులు సద్దుమణిగిన కూడా నిర్మాతలు ఈ ధైర్యం చేయకపోవడంపై నిరాశపడుతున్నారు. ఆంధ్రాలో కూడా టికెట్ రేట్లు ఇష్యూ అవడం ఇప్పుడు సినిమాలు రావడానికి అడ్డంకిగా మారింది. ఇన్ని కండిషన్స్ నేపథ్యంలో నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలంటే ఎంతైనా ఆలోచిస్తాడు. మరి ఆగస్టు లో సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో చూడాలి.