దివ్యభారతి ఈ తరం జనరేషన్ సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. 1990వ దశకంలో హీరోయిన్‌గా ఆమె దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. దివ్యభారతి బాలీవుడ్లో హీరోయిన్‌గా పరిచయం అయ్యి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ లు కొట్టింది. ఈ క్రమంలోనే ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది. తెలుగులో వెంకటేష్ బొబ్బిలి రాజా - మెగాస్టార్ చిరంజీవి రౌడీ అల్లుడు - మోహన్ బాబుతో అసెంబ్లీ రౌడీ - బాలకృష్ణ తో ధర్మక్షేత్రం లాంటి సినిమాలు చేసింది. అయితే కెరీర్ పరంగా తిరుగులేని ఫాం లో దూసుకుపోతున్న దివ్యభారతి బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియ‌డ్‌ వాలా ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఆమె ఒక మేడ మీద నుంచి కింద పడి మృతి చెందింది. ఆమె మృతిపై ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయిజ. ఏదేమైనా దివ్య భార‌తి మ‌ర‌ణం ఇప్ప‌ట‌కీ ఓ మిస్ట‌రీయే.

ఇదిలా ఉంటే దివ్యభారతి చనిపోయిన సమయంలో ఆమె హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. కోలీవుడ్ సినీయ‌ర్‌ హీరో ప్రశాంత్ హీరోగా నటించిన తొలిముద్దు సినిమా అప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక బాలీవుడ్ లో అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ కపూర్ సినిమా కర్తవ్య లోనూ ఆమె హీరోయిన్. ఆ సినిమా కూడా సగం షూటింగ్ పూర్తయిన సమయంలోనే దివ్యభారతి మృతి చెందింది. అయితే ఈ రెండు సినిమాల బ్యాలెన్స్ పార్ట్ ను వేరే హీరోయిన్లను తీసుకుని పూర్తి చేసి రిలీజ్ చేశారు.

తొలిముద్దు సెకండాఫ్‌లో దివ్యభారతి పోలికలతో ఉన్న రంభ‌ను పెట్టి సినిమా పూర్తి చేశారు. ఇక కర్తవ్య కోసం దివ్యభారతి స్థానాన్ని జుహీచావ్లా భర్తీ చేసింది. తాజాగా దివ్యభారతి మృతి చెంది 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంజయ్ కపూర్ నాటి సంఘటనను గుర్తుచేసుకుని ఆమె తనతో పాటు దిగిన తొలి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దివ్యభారతి మరణంతో ఆగిపోయిన కర్తవ్య పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన జుహీని అభినందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: