ఇదిలా ఉంటే దివ్యభారతి చనిపోయిన సమయంలో ఆమె హీరోయిన్గా నటిస్తోన్న కొన్ని సినిమాలు షూటింగ్ మధ్యలో ఉన్నాయి. కోలీవుడ్ సినీయర్ హీరో ప్రశాంత్ హీరోగా నటించిన తొలిముద్దు సినిమా అప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక బాలీవుడ్ లో అప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంజయ్ కపూర్ సినిమా కర్తవ్య లోనూ ఆమె హీరోయిన్. ఆ సినిమా కూడా సగం షూటింగ్ పూర్తయిన సమయంలోనే దివ్యభారతి మృతి చెందింది. అయితే ఈ రెండు సినిమాల బ్యాలెన్స్ పార్ట్ ను వేరే హీరోయిన్లను తీసుకుని పూర్తి చేసి రిలీజ్ చేశారు.
తొలిముద్దు సెకండాఫ్లో దివ్యభారతి పోలికలతో ఉన్న రంభను పెట్టి సినిమా పూర్తి చేశారు. ఇక కర్తవ్య కోసం దివ్యభారతి స్థానాన్ని జుహీచావ్లా భర్తీ చేసింది. తాజాగా దివ్యభారతి మృతి చెంది 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంజయ్ కపూర్ నాటి సంఘటనను గుర్తుచేసుకుని ఆమె తనతో పాటు దిగిన తొలి ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దివ్యభారతి మరణంతో ఆగిపోయిన కర్తవ్య పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన జుహీని అభినందించాడు.