టాలీవుడ్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమాతో కెరీర్ ప్రారంభించిన త్రివిక్రమ్ ఆ తర్వాత టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - అల్లు అర్జున్ - జూనియర్ ఎన్టీఆర్ లకు బ్లాక్ బ‌స్టర్ హిట్లు ఇచ్చాడు. హీరోల తో సంబంధం లేకుండా త్రివిక్రమ్ కు సొంత మార్కెట్ ఉందంటే త్రివిక్రమ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా త్రివిక్రమ్ పై ఓ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఓ యంగ్‌ డైరెక్టర్ ను తొక్కేస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.  పవన్ ప్రస్తుతం మలయాళ హిట్ సినిమా అయ్య‌ప్ప కోషియ‌మ్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్నారు. ఈ సినిమాను సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. విచిత్రమేంటంటే ఈ సినిమాకు స్క్రీన్ ప్లేలో సాయంతో పాటు డైలాగ్స్ త్రివిక్రమ్ ఇస్తున్నాడు. సాగర్ కే చంద్ర కేవలం దర్శకుడు మాత్రమే. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే వేరే ఎవరికీ ప‌ని ఉండదు. వీరిద్దరి కాంబినేషన్లో చివరిసారిగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు ఇస్తుండడంతో మొత్తం త్రివిక్రమ్ చెప్పినట్టే నడుస్తుందన్న ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ సాగర్ కే చంద్ర ను బాగా డామినేట్ చేస్తున్నారట. సెట్లో తప్పకుండా త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే షూటింగ్ జరుగుతోందట. ఇక ప‌వ‌న్ కూడా కొంత వ‌ర‌కు ద‌ర్శ‌క‌త్వం చేసేస్తాడ‌న్న‌ది తెల‌సిఇందే.  ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ త్రివిక్ర‌మ్‌, ప‌వ‌న్ కే దక్కుతుంది అన్న చ‌ర్చ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ‌ సినిమా ఫ‌ట్ అయితే  అప్పుడు మాత్రం సాగర్ కే చంద్ర మీద మొత్తం నెట్టివేస్తార‌ని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: