ఇటీవల కాలంలో వివాస్పద అంశాలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. సెలెబ్రిటీలుగా కొద్దో గొప్పో పేరు తెచ్చుకున్న నటీనటులతో పాటు ఇండస్ట్రీలో స్టార్స్ గా క్రేజ్ ను అనుభవిస్తున్న వాళ్ళు సైతం తమ కామెంట్స్ తో సంచలనం సృష్టిస్తున్నారు. అందులో ఎంత వరకు నిజం ఉంటుందో లేదో అనేది ఎవరికీ అవసరం లేదు. కానీ వారి వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతూ ఉంటాయి. తాజాగా వివాదాస్పద రియాలిటీ షో బిగ్ బాస్‌ గురించి ఓ మాజీ కంటెస్టెంట్ అలాంటి కామెంట్స్ చేశారు. వివేక్ మిశ్రా... హిందీ 'బిగ్ బాస్‌'లో పాల్గొని తన స్టైల్ తో పాపులారిటీతో సంపాదించుకున్నాడు. అతను సీజన్ 7 పోటీదారులలో ఒకడు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన వివేక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పైగా ఒక వీక్ లోనే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు వివేక్ మిశ్రా బెహాద్... నటుడు కుశాల్ టాండన్‌తో గొడవ పడ్డాడు. ఆ కాంట్రవర్సీతోనే వివేక్ బయటకు వచ్చేశాడు. అతడిని 'న్యూడ్ యోగా గురువు' అని కూడా అంటారు.

ఈ వారం ప్రారంభంలో ఓటిటిలో ప్రసారమయ్యే 'బిగ్ బాస్' రాబోయే సీజన్‌లో భాగంగా వివేక్ మిశ్రాను సంప్రదించారు. టీవీ ఖచ్చితంగా దాని స్వంత మార్గదర్శకాలను కలిగి ఉంది. కానీ డిజిటల్ విషయానికి వస్తే మార్గదర్శకాలు మరింత భిన్నంగా ఉంటాయి. రియాలిటీ షో మొదట డిజిటల్‌గా ప్రసారం చేయబడుతుంది. కాబట్టి షో నిర్వాహకులు వివేక్ మిశ్రాను రియాలిటీ షోలో పాల్గొనడం ఇష్టమేనా? అని అడిగారట. అంతేకాదు వివేక్ న్యూడ్ యోగాతో షోకు స్పైస్ ను జోడించాలని భావిస్తోందట.  

వివేక్ మిశ్రా చెప్పిన దాని ప్రకారం స్పైస్ కంటెంట్‌ కోసం షోలో తనను న్యూడ్, సెమీ-న్యూడ్ యోగా చేయమని అడిగారు. "బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, జెన్నిఫర్ లోపెజ్ అయినా" యాంకర్ కారణంగా మాత్రమే వివాదాస్పద రియాలిటీ షోకు ఎప్పుడూ హైప్ రాదని ఆయన అన్నారు. మేకర్స్ తాను న్యూడ్ యోగా చేయాలని కోరుకుంటున్నందున ఆయన ఈ షోకు నో చెప్పేశాడట.  


మరింత సమాచారం తెలుసుకోండి: