సూపర్ స్టార్ మహేష్ టాలెంటెడ్ డైరక్టర్ పరశురాం ఇద్దరు కలిసి చేస్తున్న మూవీ సర్కారు వారి పాట. రెండు బడా నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ మాస్ లుక్ తో కనిపించి అలరిస్తాడని తెలుస్తుంది. మూవీలో మహానటి కీర్తి సురేష్ కథనాయికగా మహేష్ సరసన నటిస్తుంది. సినిమాకు ఎస్.ఎస్ థమన్ తన మార్క్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసిందే.

సినిమా నుండి ఫస్ట్ లుక్ గా మహేష్ మాస్ లుక్ ఫ్యాన్స్ ను అలరించింది. కార్ లోని అలా చూస్తున్న సూపర్ స్టార్ స్టిల్ అదిరిపోయిందని చెప్పొచ్చు. కొన్ని సినిమాలు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఓ రేంజ్ కిక్ ఇస్తాయి అలాంటి వాటిలో సర్కారు వారి పాట ఒకటని చెప్పొచ్చు. ముఖ్యంగా మహేష్ లాంటి స్టార్ హీరోతో పరశురాం చేస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉండగా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఫస్ట్ లుక్ ఉందని చెప్పొచ్చు.

సినిమా కోసం పరశురాం తన ఫోకస్ మొత్తం పెట్టి చేస్తున్నాడని ఫస్ట్ లుక్ చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు స్టార్ హీరోని హ్యాండిల్ చేసిన అనుభవం లేని పరశురాం మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ తోనే తనకు ఇచ్చిన అవకాశంతో మాట నిలనెట్టుకోవడం కాదు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగురవేసుకునేలా చేస్తాడని అనిపిస్తుంది. ఫస్ట్ లుక్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన పరశురాం ఇక టీజర్ తో ఎలాంటి రచ్చ చేస్తాడు అన్నది తెలియాల్సి ఉంది. మహేష్, కీర్తి సురేష్ జోడీ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు మూవీస్ తో వరుస హిట్లు అందుకున్న మహేష్ సర్కారు వారి పాటతో డబుల్ హ్యాట్రిక్ షురూ చేయాలని చూస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: