త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మెగా కాంబో శంకర్, రాం చరణ్ ల మూవీకి హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఈ మూవీలో హీరోయిన్ కియరానే అంటూ గట్టిగానే వార్తలు వినిపించాయి. అయితే అలియా భట్ కు నటించే ఛాన్స్ ఉందని కొందరు అన్నారు కాని అలియా భట్ కాదు కియరా అద్వానినే ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. చరణ్, కియరా మరోసారి రొమాన్స్ కు రెడీ అవుతున్నారు.

ఆల్రెడీ వినయక్ విధేయ రామ సినిమాలో చరణ్ తో జోడీ కట్టింది కియరా అద్వానిమూవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఇక లేటెస్ట్ గా చరణ్ మరోసారి కియరాతో జత కడుతున్నాడు. శంకర్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచన చరణ్ ఇచ్చిందే అని తెలుస్తుంది. హీరోయిన్ విషయంలో చరణ్ ఇన్వాల్వ్ మెంట్ ఉందని టాక్. వినయ విధేయ రామ టైం లోనే చరణ్ తో కియరా చాలా క్లోజ్ అయ్యింది. సినిమా పూర్తయ్యాక కూడా కియరా బర్త్ డే పార్టీకి చరణ్ అటెండ్ అయ్యాడు. ఇక ఆ క్లోజ్ నెస్ తోనే చరణ్ సినిమాలో కియరాకి ఛాన్స్ ఇప్పించాడని అంటున్నారు.

అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కియరా అయితేనే పర్ఫెక్ట్ అన్న ఆలోచనతో చరణ్ ఆమె పేరు సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అదీగాక బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్న కియరా కొద్ది పాటి గ్యాప్ తో తెలుగు సినిమాకు సైన్ చేయడం విశేషం. తప్పకుండా కియరా అద్వాని కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. మరి చరణ్, కియరా మొదటి మూవీ ఫ్లాప్ అయినా రాబోతున్న ఈ భారీ మూవీ అయినా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: