ఇప్పటికే వకీల్ సాబ్ ద్వారా సూపర్ హిట్ కొట్టి మళ్ళి మంచి ఫామ్ తో ఫ్యాన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి క్రిష్ తీస్తున్న పీరియాడికల్ మూవీ హరిహర వీరమల్లు కాగా మరొకటి మలయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్. అయితే వీటిలో హరిహర వీరమల్లు ఇప్పటికే కొద్దిపాటి షూటింగ్ ని పూర్తి చేసుకోగా త్వరలో తదుపరి షెడ్యూల్ ని మొదలెట్టనున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మెగాసూర్య ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక అయ్యప్పనుం రీమేక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా దీనిని సాగర్ కె చంద్ర తీస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా దగ్గుబాటి రానా మరొక కీలక రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో వచ్చే ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ ఎపిసోడ్, అలానే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ వంటివి మైండ్ బ్లోయింగ్ గా ఉండనున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్.

ఇప్పటికే పవర్ స్టార్ పై పవర్ఫుల్ ఇంట్రడక్షన్ సీన్, అలానే పవన్ రానాల పై అదిరిపోయే ఇంటర్వెల్ సీన్ తీసిన యూనిట్ త్వరలో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు తీయనున్నారట. అలానే ఒరిజినల్ మాతృకని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా రచయిత త్రివిక్రమ్ అద్భుతంగా మార్చినట్లు సమాచారం. ముఖ్యంగా పవర్ స్టార్ కి ఫ్యాన్ అయిన దర్శకుడు సాగర్ మొత్తం సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తున్నారట. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: