సినిమాలంటే ప్రజలకు ఎంత పిచ్చి అంటే అది మాటల్లో వివరించదగినది కాదు. అందులోనూ సినిమాలలో నటించే హీరోలు మరియు హీరోయిన్ లకు అయితే ప్రాణానికి ప్రాణమిచ్చేంత అభిమానులుంటారు. అయితే అభిమానం ఉండడం సహజమే. ప్రతి ఒక్కరూ సినీ నటుడిని అభిమానించడం మాములే. కానీ ఆ అభిమానము హద్దులు దాటితేనే ప్రమాదం. ఈ విషయం చాలా సందర్భాలలో ఋజువయింది. ఎలాగంటే ఎక్కడో ఉన్న సినిమా హీరో కోసం ఇక్కడ మన ముందున్న ఇద్దరు అభిమానులు గొడవలు పడుతారు. కొన్ని సమయాలలో అయితే అవి చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంటాయి. ఇలాంటి వాటిని అదుపులో పెట్టడానికి అభిమానం యొక్క విలువను, దాని పరిమితిని తెలియచేయడానికి ఎన్నో సార్లు ఆడియో ఫంక్షన్ లలో మరియు రిలీజ్ ఫంక్షన్ లలో అభిమానులను ఉద్దేశించి హీరోలు మరియు హీరోయిన్లు చెబుతారు.

కానీ ఇప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు అలాంటి ఒక మెగా హీరో అభిమాని దీన స్థితిలో ఉన్న కథను ఇప్పుడు తెలుసుకుందాము. హీరోలపై వారికున్న అభిమానమే వారిలా మారే విధంగా ప్రేరేపిస్తుంది. వారిలా మాట్లాడడం, వారిలా డ్యాన్స్ చేయడం, వారిలాగానే రూపాన్ని మార్చుకోవడం లాంటివి చేసి ఒక హీరోకి డూప్ లాగే మారుతుంటారు. అలాంటివారిని మనము చాలా మందిని చూస్తుంటాము. ప్రతి ఒక్క అగ్ర హీరోకు డూప్ నటుడు ఉన్నారు. ఇందులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మరియు నాగార్జున లకు డూపు లు చేస్తున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవికి డూప్ చేస్తున్న రాజు అనే కళాకారుడు ప్రస్తుతం చాలా దీన స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఎటువంటి ప్రోగ్రాం లు చేయక ఆర్ధికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల బాలకృష్ణ డూప్ గా చేస్తున్న కళాకారుడు ఈయన పడుతున్న ఇబ్బందులను ఒక ఇంటర్వ్యూ వేదికగా వివరించాడు. చిరంజీవికి వీరాభిమాని అయిన చిరు డూప్  రాజాకు పెళ్లి అయ్యింది. కానీ వారికి ఇంకా పిల్లలు లేరు. పైగా రాజా గత కొంతకాలంగా వీరిద్దరినీ పోషించుకోలేని పరిస్థితుల్లో, ఏమి చేయాలో అర్ధం కాక చివరికి పక్షవాతానికి గురయిన వైనం చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాక మానవు. వీరి గురించి తెలిసిన కొందరు కళాకారులూ తమకు తోచిన సహాయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ చూసిన వారు రాజాకు ఖచ్చితంగా సహాయం చేయాలని కోరుకున్నాడు సదరు బాలకృష్ణ డూప్.

మరింత సమాచారం తెలుసుకోండి: