2020 లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన అలవైకుంఠపురములో మూవీతో తన కెరీర్ లో పెద్ద సక్సెస్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆ మూవీలోని సాంగ్స్ సూపర్ సక్సెస్ తో హీరోగా జాతీయ స్థాయిలో ఎంతో పేరు దక్కించుకున్నారు. దాని అనంతరం ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా దీనిని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ లారీ క్లీనర్ పాత్ర చేస్తుండగా రష్మిక కూడా పక్కా మాస్ పాత్ర చేస్తున్నట్లు టాక్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మలయాళ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాసిల్ విలన్ గా నటిస్తుండగా పలువురు కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే తొలి భాగం చాలా వరకు షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ని ఆగష్టు నెల మొదటి వారంలో విడుదల చేయనుందట పుష్ప యూనిట్.

ఈ సినిమాలో మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయని, అలానే ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కి సంగీత దర్శకుడు దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ అందించినట్లు టాక్. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లు టాక్. మరి ఈ వార్త కనుక నిజం అయితే ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయనున్నారని సమాచారం..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: