యువ దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా రానా ఒక ముఖ్యమైన మాస్ రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై సూర్యదేవర నాగ వంశీ ఎంతో ప్రతిష్ఠమకంగా నిర్మిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాని ఇటీవల మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుం కోషియం అనే సూపర్ హిట్ మూవీ కి అఫీషియల్ రిమేక్ గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమా కథని మన తెలుగు ఆడియన్స్ ని అలరించేలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి పవర్ఫుల్ డైలాగ్స్ కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్, త్రివిక్రమ్ ల కాంబో లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలవడంతో ఈ సినిమా విషయమై పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా త్రివిక్రమ్ పైనే కొంత నమ్మకాలు పెట్టుకున్నారు.

మరోవైపు దర్శకుడు సాగర్ కూడా మూవీ అందరికీ పక్కాగా అలరించేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నారని సమాచారం. పవన్, రానా ల పాత్రలు సినిమాలో ఎంతో అదిరిపోతాయని, త్వరలో ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడం తో పాటు మూవీ ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేలా మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని అలరిస్తుందో తెలియాలి అంటే మరొక ఐదు నెలల వరకు ఓపిక పట్టాల్సిందే. మరి గురూజీ పవన్ ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు నెరవేరుస్తారో చూడాలి ...... !!


మరింత సమాచారం తెలుసుకోండి: