ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. తీసిన రెండు సినిమాలకే తన టాలెంట్ ఏంటో చూపించిన డైరక్టర్ నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్ కె మూవీతో వరల్డ్ వైడ్ సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ మూవీ హాలీవుడ్ ప్రాజెక్ట్ లకు ఏమాత్రం తక్కువ కాకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ప్రాజెక్ట్ కె మూవీలో ఆల్రెడీ హీరోయిన్ గా అందాల భామ దీపిక పదుకొనెని తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ కె లో మరో హీరోయిన్ కూడా అవసరం ఉంటుందని తెలుస్తుంది. అయితే ఈమధ్య ఆ సెకండ్ హీరోయిన్ ఛాన్స్ సమంత కొట్టేసిందని వార్తలు వచ్చాయి. కాని ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లో అనుష్కని భాగం చేయాలని భావిస్తున్నాడట. అందుకే ప్రాజెక్ట్ కె లో అనుష్క సెకండ్ లీడ్ గా నటిస్తుందని అంటున్నారు. సెకండ్ లీడ్ అనే కాని సినిమాలో సెకడ్ హీరోయిన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని.. మూవీలో హీరో పక్కన ఉండే పాత్ర అదని తెలుస్తుంది.

ఇప్పటికే ప్రాజెక్ట్ కె మీద ఏవేవో ఊహాగానాలు రాగా ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ అనుష్క ఈ కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇద్దరు కలిసి నటించిన మూవీస్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా బాహుబలి దేవసేనగా వీరి నటన అదిరిపోయింది. అందుకే ప్రభాస్ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కె లో అనుష్క కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ప్రాజెక్ట్ కె మీద రోజుకొక కొత్త న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను కన్ ఫ్యూజ్ చేస్తుంది. తప్పకుండా ఈ మూవీ అంచనాలకు మించి ఉంటుందని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: