మళయాళంలో స్టార్ హీరోయిన్ గా సూపర్ ఫాం లో ఉన్న టైం లో తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. నేను శైలజ మూవీతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన ఈ అమ్మడు నేను లోకల్, అజ్ఞాతవాసి మూవీస్ లో అలరించింది. నేను లోకల్ హిట్ కాగా అజ్ఞాతవాసి కీర్తి సురేష్ కు షాక్ ఇచ్చింది. ఇక మళ్లీ మహానటితో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న కీర్తి సురేష్మూవీ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటుంది అనుకుంటే తమిళంలో బిజీ అవడం వల్ల టాలీవుడ్ కు దూరమైంది.

ఇక తర్వాత నాగార్జున మన్మథుడు 2లో గెస్ట్ రోల్ చేసిన అమ్మడు పెంగ్విన్ తో తెలుగు, తమిళ ఆడియెన్స్ ను మెప్పించాలని ప్రయత్నించినా వర్క్ అవుట్ అవలేదు. ఈమధ్యనే మిస్ ఇండియా అంటూ వచ్చినా కీర్తి సురేష్ ఆ మూవీతో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో ఆమెకు నితిన్ సరసన రంగ్ దే మూవీ ఛాన్స్ వచ్చింది. సినిమా జస్ట్ ఓకే అనిపించింది. అయితే లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట మూవీలో నటిస్తుంది కీర్తి సురేష్. ఈ మూవీ మీద అన్ని ఆశలు పెట్టుకున్న కీర్తి సురేష్మూవీ తర్వాత తెలుగులో మళ్లీ బిజీ అవ్వాలని చూస్తుంది.

పవన్ అజ్ఞాతవాసి తర్వాతనే ఆమెకు స్టార్ అవకాశాలు వస్తాయని అనుకోగా అది సాధ్యపడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు సర్కారు వారి పాట మీద భారీ హోప్స్ పెట్టుకుంది మహానటి. అందం అభినయం ఉన్నా తెలుగులో అమ్మడికి లక్ కలిసి రావట్లేదని చెప్పొచ్చు. మహేష్ లాంటి స్టార్ హీరో మూవీలో నటిస్తుంది కాబట్టి తప్పకుండా సర్కారు వారి పాట తర్వాత కీర్తి తెలుగులో పక్కా బిజీ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి కీర్తి సురేష్ కు సర్కారు వారి పాట ఎంతమేరకు లక్ తెస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: