అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీం ‘దోస్తీ’ పాటను రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పాట విడుదలై సూపర్ హిట్ అయింది. యూట్యూబ్‌లో ఈ పాట తెగ వైరల్ అవుతోంది. లక్షల్లో వ్యూవ్స్‌తో దూసుకెళ్తోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి.. తన విజన్, ప్లానింగ్‌తో మరోసారి హిట్ నమోదు చేసుకున్నారు. ఆచీతూచి అడుగు వేసే రాజమౌళి.. ఎలా చేస్తే సక్సెస్ వస్తుందనే విషయంలో మరోసారి సత్తా చాటారు. ఆర్ఆర్ఆర్ మొదటిపాటతోనే సెన్సేషన్ సృష్టించారు. ఇన్నేళ్లుగా ప్రేక్షకుల ఎదురుచూపులు వేస్ట్ కాలేదు. ఇది వర్త్ వెయిట్ ద్వారా వచ్చిన సక్సెస్ అని రాజమౌళి చెప్పుకొచ్చారు. కాగా.. ఈ పాట తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయింది.

అయితే.. ప్రస్తుతం ఇదే బాటలో ‘పుష్ప’ టీం కూడా అడుగులు వేస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాన్ని అందిస్తున్నారు. అయితే వాస్తవానికి పుష్ప సినిమా ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఈ ఏడాది ప్రారంభంలోనే ప్రకటించింది. కానీ కోవిడ్-19 సెకండ్ వేవ్ రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయలేకపోతున్నట్లు సమాచారం.

అయితే అప్పటివరకు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ఉండేలా పుష్ప టీం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు సినిమాపై ఎక్స్‌పెక్టేషన్ పెరిగేలా ప్రయత్నిస్తోంది. తాజాగా పుష్ప సినిమాకు సంబంధిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా తరహాలోనే ఫస్ట్ సాంగ్‌ను 5 భాషల్లో విడుదల చేయనున్నారు. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్ కాంబోనేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో పాటలు ఏ రేంజ్‌లో ఉంటాయనే దానిపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: