చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి మధుబాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మోహన్‌లాల్ సరసన 'యోధ', అరవింద్ స్వామి జోడీగా 'రోజా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఆమె నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమకి అల్లరి ప్రియుడు సినిమాతో పరిచయమైయ్యారు. ఈ సినిమాని కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల కలిసి నటించారు. కాగా.. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

అయితే ముఖ్యంగా మణిరత్నం 'రోజా' సినిమా ఆమెను దేశవ్యాప్తంగా సెన్సేషనల్ యాక్ట్రెస్‌ను చేయడంతో పాటు మంచి గుర్తింపు, పేరును తీసుకొచ్చింది. ఆ తరువాత ఫూల్ ఔర్ కాంటే, జెంటిల్‌మన్‌, జాలిమ్‌, గణేశ్‌, వానమే ఎల్లాయ్‌, ప్రేమ్ యోగ్ లాంది నార్త్‌, సౌత్ సినిమాల్లో హీరోయిన్‌గా ఆమె నటించారు. పెళ్లి చేసుకొని చాలా కాలం సినిమాలకు దూరమైన ఆమె 'అంతకు ముందు ఆ తర్వాత' మూవీతో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

అంతేకాదు.. రాజేంద్రప్రసాద్‌తో 'కాలేజ్ కుమార్‌'లో నటించారు మధుబాల. ఇక త్వరలో ఆమె 'తలైవి'లో ఎంజీఆర్ భార్య జానకిగా కనిపించనున్నారు. అంతేకాక.. గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే 1990లో ఆనంద్ షా అనే బిజినెస్‌మేన్‌ను వివాహం చేసుకుంది మధుబాలు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

ఇక వారిద్దరి పేర్లు కియా షా, అమేయ షా. కాగా.. అందచందాల విషయంలో ఇద్దరూ తల్లిని తలదన్నేట్లు రెడీ అయ్యారు. అయితే మధుబాల కూతుర్లకు సంబంధించిన ఫొటోలను అప్పుడప్పుడూ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తుంది.మధుబాల. ఇక ఇటీవల తన కూతుళ్ల ఫొటోను షేర్ చేసిన మధు, అబ్రాడ్‌లో ఉన్న అమేయను మిస్సవుతున్నానంటూ రాసుకొచ్చారు. అయితే ఆ పోస్టుకు ఫ్యాన్స్ రెస్పాండ్ అవుతూ త్వరలో ఇద్దరు హీరోయిన్లు మీ ఫ్యామిలీ నుంచి వస్తున్నట్లు కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: