అల్లు అర్జున్, రష్మిక మందన్న ల తొలి కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పుష్ప. సుకుమార్ తీస్తున్న ఈ భారీ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్, పాన్ ఇండియా మూవీగా ఎంతో అత్యధిక ఖర్చుతో తెరకెక్కుతోంది. మొత్తంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పుష్ప మూవీ పార్ట్ 1 షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మళయాల నటుడు ఫహద్ ఫాసిల్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తుండగా ఇతర పాత్రల్లో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన కీలక నటులు యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత ఏడాది వచ్చిన అలవైకుంఠపురములో మూవీ తో భారీ హిట్ సొంతం చేసుకుని తన ఇమేజ్ ని మరింతగా పెంచుకున్న అల్లు అర్జున్ ఈ పుష్ప మూవీతో కూడా మరొక భారీ హిట్ సొంతం చేసుకోవడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే అసలు విషయం ఏమిటంటే నేడు కొద్దిసేపటి క్రితం పుష్ప అఫీషియల్ రిలీజ్ డేట్ ని యూనిట్ ప్రకటించింది.

తమ సినిమా పార్ట్ 1 (పుష్ప - ది రైజ్) ని క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక లారీ క్లీనర్ గా యాక్ట్ చేస్తుండగా రష్మిక మందన్న గిరిజన యువతి పాత్ర చేస్తున్నట్లు టాక్. కాగా ఈ సినిమా నుండి దాక్కో దాక్కో మేక అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ని ఈనెల 13న విడుదల చేయనున్న విషయం తెలిసిందే .... !!  



మరింత సమాచారం తెలుసుకోండి: