టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు మంచి డిమాండ్ ఉంది. కొంత మంచి యాక్టింగ్ చేస్తే చాలు వారికి వరస సినిమాల్లో అవకాశాలు రావడం జరుగుతుంది. దానికి తోడు కొంత గ్లామర్ కూడా ప్రదర్శిస్తే వారికి ఎదురు లేదని చెప్పవచ్చు. అలా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ముఖ్యంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గ్లామర్ తో పాటు అభినయాన్ని కూడా పంచుతున్నారు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు. అలా టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి మంచి పాత్రలతో ఆకట్టుకొని బాగా దగ్గరైన నటీమణి పవిత్ర లోకేష్.

ఇదిలా ఉంటే మోసపోవడం అనేది సమాజంలో ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న బాధే. నార్మల్ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు సైతం కొన్ని కొన్ని సార్లు డబ్బు విషయంలో ఇతర విషయాలలో మోసపోతుంటారు. బడా నిర్మాతలు సైతం మోసపోయిన సందర్భాలను చెప్పి ఎంతో బాధ పడ్డారు. ఇప్పుడు అదే కోవలో టాలీవుడ్ ప్రముఖ నటి కూడా చేరింది. నేటి పవిత్ర లోకేష్ కూడా భారీగా మోసపోయింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలైన సీనియర్ నటి పవిత్ర లోకేష్ కు ఆమె సన్నిహితుడే పెద్ద షాకిచ్చాడట.

ఆర్టిస్టుగా తను సినిమాల్లో బిజీగా ఉండడంతో మేనేజర్ ను ఎంతగానో నమ్మాను. దానిని ఆసరాగా తీసుకొని నన్ను నట్టేట ముంచినట్టుగా తెలిపింది. ఆర్థిక లావాదేవీల లో తన కళ్ళు కప్పి ఆ మేనేజర్ మోసం చేసినట్లు తెలిపింది. దాదాపు 60 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించలేదని ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చే వరకు ఈ విషయం తనకు తెలియదని, అప్పట్లో తనపై నెగెటివ్ వార్తలు కూడా వచ్చాయని చెప్పింది. గతంలో సినిమా సెలబ్రిటీలు ఎందరో ఇటువంటి మోసాలకు గురయ్యారు. కెరియర్ లో బిజీగా ఉండి ఆర్థిక లావాదేవీలను వేరే వారికి అప్పగించి వారిని గుడ్డిగా నమ్మి కోట్లు కోల్పోయిన సందర్భాలు, సెలబ్రిటీ లు చాలా మంది ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: