టాలీవుడ్ లో బుల్లితెర యాంకర్ లు ఇప్పుడు హీరోయిన్ ల కంటే ఎక్కువగా సందడి చేస్తున్నారు. వారు బుల్లితెరపై చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. బుల్లితెరపై కూడా అందాలు చూపించవచ్చు అని ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ యాంకర్ ల వల్ల తెలుస్తుంది. పొట్టి పొట్టి డ్రెస్సులతో మంచి బుల్లితెరను కలర్ ఫుల్ గా మార్చడమే కాకుండా వరుస సినిమా ఛాన్సులు అందుకుంటూ దూసుకుపోతున్నారు. బుల్లితెర పైన మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు సైతం యాంకర్ లు భారీ మొత్తాన్ని సంపాదిస్తూ ఉంటారు.  

అలా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న సుమ, అనసూయ రష్మీ, శ్రీముఖి వంటి యాంకర్ లు ఒక ఈవెంట్ కు ఎంత పారితోషకం తీసుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ సినిమా పరిశ్రమ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ , ఆడియో రిలీజ్ ఈవెంట్ అంటే అందరికీ తప్పకుండా గుర్తు వస్తుంది సుమ. అన్ని పెద్ద సినిమాలకు సుమ నే తప్పకుండా పెట్టుకుంటారు.  సుమ ఒక్కో ఈవెంట్ కు  రెండు నుంచి రెండున్నర లక్షల వరకు పారితోషికం తీసుకుంటూ ఉండగా ఆ రెండు లక్షల కు తగ్గ ఫలితం మాత్రం తప్పకుండా ఈవెంట్లో కనిపిస్తుంది. ఆమె చేసే సందడి, అల్లరి ఎవరూ చేయలేరు. పెద్ద హీరోలపై సెటైర్లు వేయగల యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక సుమ అని మాత్రమే అని చెప్పవచ్చు.

సుమ తర్వాత ఎక్కువ ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కనిపించే మరొక యాంకర్ అనసూయ. ఈమె కూడా తన వాక్చాతుర్యంతో ఈవెంట్ కి వచ్చే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాలలో నటించడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా పెద్దగా కనిపించడం లేదు. కానీ బుల్లితెరపై మాత్రం తన అందాలతో రచ్చ చేస్తూనే ఉంది. బుల్లి తెరపై తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మరొక యాంకర్ రష్మి.ఈమె కూడా కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో కనిపిస్తుంది.  ఈమె దాదాపు లక్షన్నర తీసుకుంటుంది. ఇతర యాంకర్ లు అయిన శ్రీముఖి, మంజుష, శ్యామల, భార్గవి వంటివారు 50 వేల నుంచి లక్ష వరకు ఛార్జ్ చేస్తూ ఉంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: