టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.వరుసగా సినిమాల మీద సినిమాలను ఒప్పుకుంటున్నాడు.అయితే ఈ విషయంలో చిరూ కేవలం యువ దర్శకులకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు.ఇందులో భాగంగానే ఇప్పటికే తమిళ దర్శకుడు మోహన్ రాజా,బాబీ,మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ కథలకు ఓకే చెప్పేసాడు.ఇక ఇప్పుడు లేటెస్టుగా మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఆయన మరెవరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మారుతి. ఇక మెగాస్టార్ తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు మారుతి.ఇప్పటికే చిరంజీవి కోసం రెండు మూడు కథలను కూడా రెడీ చేసుకున్నాడు.

అయితే ఇటీవలే చిరంజీవిని కలిసిన మారుతి ఆయనకి ఓ కథ వినిపించినట్లు సమాచారం.అంతేకాదు మారుతి చెప్పిన కథ చిరుకి బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట.మరోవైపు ఇదే కథని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా విన్నారని..ముందు ఆయనకు ఈ కథ నచ్చాకే.. చిరంజీవి దగ్గరకు పంపారని తెలుస్తోంది.ఇక మెగాస్టార్ తో పాటూ అల్లు అరవింద్ గారి ప్రోత్సహం కూడా ఈ కథకి తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ వచ్చేసినట్టే అని అంటున్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదు.

అప్పుడెప్పుడో బోయపాటి శ్రీను, చిరూ ల కాంబినేషన్లో అల్లు అరవింద్సినిమా చేయాలని భావించారు.అయితే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఇటీవల బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' సినిమా డిజాస్టర్ అవ్వడంతో చిరూ మళ్ళీ ఆ రిస్క్ చేయలేదు.ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మారుతి చిరు ల కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. మరికొన్ని రోజుల్లోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి అక్టోబర్ నెలలో రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: