టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ నటిస్తున్న మూడు సినిమాలు వచ్చే ఏడాది లోనే విడుదల కానున్నాయని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్'సినిమా చేస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ,ప్రభాస్ ల కాంబోలో రూపొందుతున్న 'సలార్' వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది.

ఇప్పటికే ఈ సినిమా ఓ భారీ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే మళ్ళీ షూటింగ్ మొదలుకానుంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11 న విడుదల కానుంది.అయితే ఈ లెక్కన చూసుకుంటే వచ్చే ఏడాది లో కేవలం ఏడు నెలల గ్యాప్ లోనే ఏకంగా మూడు సినిమాలని రిలీజ్ చేస్తున్నాడన్నమాట. మరి నిజంగానే ఇంత తక్కువ గ్యాప్,అది కూడా ఒకే ఏడాది మూడు సినిమాలు అంటే ప్రభాస్ సాహసం చేస్తున్నాడనే చెప్పాలి.

ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఒకే ఏడాది మూడు సినిమాలను విడుదల చేసిన అగ్ర హీరో అయితే ఎవరూ లేరు. ఆ మూడు సినిమాలు కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడం గమనార్హం.అంతేకాదు ఈ మూడు పాన్ ఇండియా సినిమాల బడ్జెట్ దాదాపు 1,000 కోట్లకు పైమాటే.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చే ఏడాది పండగే అన్నమాట.మరి నిజంగానే ప్రభాస్ ఒకే ఏడాది మూడు సినిమాలని విడుదల చేస్తాడా?లేక మనసు మార్చుకుంటాడా?అనేది తెలియాలంటే మరి కొంత కాలం వరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇప్పటికే ఈ మూడు సినిమాలపై ఆడియన్స్ లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం విశేషం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: