టాలీవుడ్ చిత్ర
సీమ లో
హీరోయిన్ గా రాణించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. చాలా మంది
హీరోయిన్ లు అదృష్టంతో పాటు కొంత టాలెంట్ నిరూపించుకుని స్టార్
హీరోయిన్ లు గా ఎదిగారు. ఇంకొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా మినిమం
హీరోయిన్ గా కూడా ఉండలేకపోయారు. విజయాలు వరించినా సరే కొంతమంది
హీరోయిన్ లు స్టార్ స్టేటస్ కు వెళ్లలేకపోయారు. ఇంకొంత మంది ఫ్లాప్ లు వచ్చినా కూడా స్టార్
హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత సూపర్ హిట్టు దక్కించుకున్నారు.
అలా తొలి సినిమాతోనే
టాలీవుడ్ లో తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది
హీరోయిన్ కియార అద్వానీ. అలా
టాలీవుడ్ లో మోస్ట్
వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే ఆమె చేసిన రెండవ
సినిమా భారీ ఫ్లాప్ కావడంతో
కియారా అద్వాని కి మూడో అవకాశం రాకుండానే పోయింది. దాంతో తను మళ్ళీ
బాలీవుడ్ కి వెళ్లి అక్కడ వరుస సినిమాలు చేసి హిట్ బాట పట్టింది. దీంతో ఆమెకు
టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి.
శంకర్ దర్శకత్వంలో
రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాకి కథా నాయిక గా ఎంపిక కాగా ఇటీవలే విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
అయితే ఈ
సినిమా కంటే ముందు
కియారా అద్వానీ కి
టాలీవుడ్ నుంచి పలు
సినిమా ఆఫర్లు రాగా వాటిని కాదని మరి
శంకర్ దర్శకత్వంలో తో మాత్రమే
సినిమా చేస్తుంది.
కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాలో
హీరోయిన్ గా ఈమెనే అనుకున్నారు కానీ ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న
త్రివిక్రమ్ సినిమాలో కూడా
హీరోయిన్ గా ఈమెనే అనుకున్నారు కానీ ఆ సినిమాను కూడా పక్కన పెట్టింది ఈ ముద్దుగుమ్మ. శంకర్ దర్శకత్వంలో భారీ అప్పీల్ ఉంటుందన్న విషయం తెలిసిందే. బహుశా అందుకే కాబోలు ఆమె ఈ సినిమాను ఒప్పుకుంది.