రష్మీక మందన్న ఇప్పుడు ఒక్క తెలుగులోనే కాకుండా ఇండియా అంత క్రేజ్ సంపాదించుకోవలని చూస్తుంది. తెలుగులో టాప్ హీరోస్ సినిమాల్లో ఒక పక్క ఛాన్సులు కొట్టేస్తూ అటు బాలీవుడ్ లో కూడా వరసగా సినిమాలని ఒప్పుకుంటుంది. ఇక తెలుగులో రష్మీక హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇవే కాకుండా రష్మీక చేతిలో శర్వానంద్ తో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా నటిస్తుంది.

అయితే రష్మీక కి ఒక కోరిక ఉందట అదేంటి అంటే ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్ అయిన సౌందర్య గారి బయోపిక్ ఒకవేళ తీస్తే అందులో ఆమెకి నటించాలని ఉంది అని చిన్నప్పుడు రష్మీక ని చూసి తన తండ్రి సౌందర్య లాగా ఉన్నావ్  అనేవాళ్ళు అని రష్మీక ఈ మద్యనే ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.ఇక రష్మీక కోరిక ఎప్పటికి తీరుతుందో వేచి చూడాలి. ఇక ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే హిందీలో సిద్దార్ధ మల్హోత్రా హీరోగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కాబోతుంది.

హిందీలో మొదటిసారి నటించడం చాలా ఆనందంగా ఉంది అని రష్మీక తెలిపారు. ఇక ఈ సినిమానే కాకుండా అమితాబ్ బచ్చన్ తో కలిసి గుడ్ బై సినిమాలో నటిస్తోంది. రష్మీక కి బాలీవుడ్ లో మంచి రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని టాక్. ఇక ఆమె తెలుగులో నటిస్తున్న పుష్ప సినిమా క్రిస్మస్ కి విడుదల అవుతుండగా శర్వానంద్ తో చేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవే కాకుండా ఆమెకి తమిల్ కన్నడలో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.ఇప్పటికే నేషనల్ క్రష్ గా పిలవబడుతున్న రష్మీక ఈ సినిమాలు హిట్ అయితే ఇంకా ఏమని పిలుస్తారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: