వైసీపీ ఎంపీ రాజకీయాల్లో జూనియర్. అసలు రాజకీయ వాసనలు కూడా లేకుండానే ఆయన తన జీవితాన్ని బిజినెస్ వైపుగా నడుపుకువచ్చారు. ఆయన ఆ రంగంలో నంబర్ వన్ గా ఉన్నారు కూడా.

మరో వైపు ఆయనకు సినిమాలు అంటే కూడా గొప్ప మోజు ఉంది. సినిమాలను తీయడం అంటే ఎంతో ఇష్టం. అలా గతంలో చాలా సినిమాలు తీశారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో విశాఖ  నుంచి  వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా అనూహ్యంగా గెలిచిన తరువాత ఎంవీవీ సత్యనారాయణ గ్రాండ్ గా తీసిన మూవీ  గల్లీ రౌడీ. ఇక ఈ మూవీ  మీద మాత్రం అంచనాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ మూవీలో హీరో సందీప్ కిషన్. హీరోయిన్ గా నేహా శెట్టిని ఎంపిక చేశారు.

ఇక సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన ఈ మూవీ గురించి చెబుతూ థియేటర్లో చూస్తేనే ఆ కిక్కు వస్తుంది అంటున్నారు. ఈ మూవీని ఎవరూ మిస్ కాకూడదు అంటున్నారు. మరో వైపు ఈ కామెడీ జనర్ మూవీస్ తీయడంతో అందె వేసిన చేయిగా ఉన్న జి నాగేశ్వరరెడ్డి ఈ మూవీ తీశారు. ఈ మూవీ ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకూ కామెడీతో కితకితలు పెడుతుంది అని అంటున్నారు.

దీంతో నిర్మాతగా ఎంవీవీకి లాభాలు తెచ్చే మూవీ అవుతుందని కూడా చెబుతున్నారు. ఎంవీవీ కూడా ఈ మూవీ మీద ధీమాగా ఉన్నారు. మరి ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే మరిన్ని సినిమాలు ఈ ఎంపీ నిర్మించే అవకాశాలు ఉంటాడ‌నడంలో సందేహం లేదు. ఈ మూవీ ఈ నెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్యకాలంలో  సరైన హిట్ లేని సందీప్ కిషన్ కి గల్లీ రౌడీ సూపర్ హిట్ ఇవ్వడం ఖాయమని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

mvv