అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లవ్ స్టొరీ చిత్రం ఈ నెల 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే అధికారికంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా ఈసారి సినిమా తప్పకుండా విడుదల అవుతుందని మాత్రం తెలుస్తుంది.

ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని ఈ చిత్రం పై సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ను బట్టి చెప్పవచ్చు. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో మంది ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా చిత్రంపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించారు. దానికి తోడు ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా సారంగదరియా పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలువగా భారీ స్థాయిలో ఈ పాటకు రెస్పాన్స్ దక్కింది. నిజానికి ఈ సినిమాపై ఆసక్తి కలిగింది కూడా ఈ పాట తోనే అని చెప్పవచ్చు. పవన్ అనే కొత్త సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. 

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేసే పనిలో చిత్రబృందం ఉండగా ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి నాగచైతన్య కోసం రావడం అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత వారిని ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి. ఫిదా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని అదే స్థాయిలో రూపొందించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: