అక్కినేని
నాగచైతన్య హీరోగా తెరకెక్కిన
లవ్ స్టొరీ చిత్రం ఈ నెల 24 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో
సాయిపల్లవి కథానాయికగా నటిస్తుండగా ఇప్పటికే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇటీవలే అధికారికంగా దీన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా ఈసారి
సినిమా తప్పకుండా విడుదల అవుతుందని మాత్రం తెలుస్తుంది.
ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయని ఈ చిత్రం పై సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ను బట్టి చెప్పవచ్చు. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా ఎంతో మంది ప్రేక్షకులు సోషల్
మీడియా ద్వారా చిత్రంపై ఉన్న ఇష్టాన్ని వెల్లడించారు. దానికి తోడు ఈ చిత్రంలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా సారంగదరియా పాట
యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలువగా భారీ స్థాయిలో ఈ పాటకు రెస్పాన్స్ దక్కింది. నిజానికి ఈ సినిమాపై ఆసక్తి కలిగింది కూడా ఈ పాట తోనే అని చెప్పవచ్చు. పవన్ అనే కొత్త
సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.
ఇక ఈ
సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్
ఈవెంట్ ను చేసే పనిలో చిత్రబృందం ఉండగా ఈ
ఈవెంట్ కు
మెగాస్టార్ చిరంజీవి రానున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకాస్త పెరిగాయి అని చెప్పవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి నాగచైతన్య కోసం రావడం అంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఈ
సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత వారిని ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి.
ఫిదా లాంటి సూపర్ హిట్
సినిమా తర్వాత
శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని అదే స్థాయిలో రూపొందించాడు.